న్యూయార్క్/బెంగళూరు: ప్రపంచంలోనే ప్రముఖ ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఈఓగా అవుతానని తను కలలో కూడా అనుకోలేదని సత్య నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్ అజూర్ క్లౌడ్ కాన్ఫరెన్స్, 2014లో ఆయన మాట్లాడుతూ..‘భారతదేశంలో పుట్టిన నేను ఈ విధంగా మైక్రోసాఫ్ట్ సిఈఓ హోదాలో మీతో మాట్లాడుతానని కలలో కూడు భావించలేదు'ని పేర్కొన్నారు. గత ఫిబ్రవరిలో స్టీవ్ బామర్ స్థానంలో తెలుగువాడైన సత్య నాదెళ్ల బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా వీడియో ప్రసారం ద్వారా పలు డెవలపర్లు, ఐటి వృత్తినిఫుణులతో ఆయన మాట్లాడారు. అజూర్ క్లౌడ్తో భారత్లో విస్తృత అవకాశాలు వస్తాయన్నదే తన విశ్వాసమని తెలిపారు. వాటన్నంటినీ మీరు ఒడిసిపట్టుకోవాలనే కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న డేటా కేంద్రాల గ్లోబల్ నెట్వర్క్తో డెవలపర్లు తమ అప్లికేషన్లను విండోస్ అజూర్ ప్లాట్ పాం ద్వారా ఎంతో త్వరితగతిన నిర్వహించుకోవచ్చని తెలిపారు.
భారతదేశంలోని ఐటి వృత్తినిపుణులు, డెవలపర్లు, స్టార్టవ్ కంపెనీలు తమ అప్లికేషన్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు అందించవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు. వ్యాపారాలను మరింత విస్తృత పర్చడానికి తమ భాగస్వాములకు ఇదొక మంచి అవకాశమని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. అజూర్ మార్కెట్లు భారత్లో వేగంగా వృద్ది చెందుతున్నాయని చెప్పారు. భారతదేశంలో మైక్రోసాఫ్ట్కు 10వేల మంది భాగస్వాములు, 1.6 మిలియన్ల డెవలపర్లు ఉన్నట్లు ఆయన చెప్పారు.

గొప్ప నాయకుల్లో మహీంద్రా, మిట్టల్
ప్రపంచంలోని 50 మంది గొప్ప నాయకులతో రూపొందించిన జాబితాలో భారత వ్యాపార దిగ్గజాలైన ఆనంద్ మహీంద్రా, లక్ష్మీ మిట్టల్కు చోటు లభించింది. ఫార్చూన్ మేగజైన్ గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో మొదటి స్థానంలో 77 ఏళ్ల పోప్ నిలిచారు. ఈ జాబితాలో నోబుల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్సాన్ సూకీ, దలైలామా, పోప్ ఫ్రాన్సిస్లు కూడా చోటు దక్కించుకున్నారు. తమ అనుచరుల శక్తిసామర్థ్యాలు పెంచడమేకాకుండా ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చి దిద్దడానికి ఈ నాయకులు దోహదపడినట్టు ఫార్చూన్ కీర్తించింది.
గొప్ప నాయకుల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా 40వ స్థానంలో నిలువగా... ఆర్సెలార్ మిట్టల్ సిఈఓ లక్ష్మీ మిట్టల్ 48 స్థానంలో ఉన్నారు. వినూత్న వ్యాపార దృక్పథం కలిగిన ఆనంద్ మహీంద్రా.. ఆటో, కంప్యూటర్ సర్వీసెస్, ఏరోనాటిక్స్ తదితర రంగాల్లో కంపెనీలను హస్తగతం చేసుకుని గ్రూప్ విస్తరణకు దోహదపడ్డారని పేర్కొంది. ఉక్కు రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో తన దైన శైలీలో నిర్ణయాలు తీసుకుంటూ లక్ష్మీ మిట్టల్ వ్యాపారంలో దూసుకుపోయారని.. అటు ప్రభుత్వం ఇటు శక్తివంతమైన కార్మిక యూనియన్లను మెప్పించారని ప్రశంసించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications