పెరుగుతున్న ప్రాధాన్యత: నోకియాకు భారత సారథి!

ఈ మేరకు ఫిన్లాండ్ మీడియా వివరాల ద్వారా తెలుస్తోంది. నోకియా మొబైల్ ఫోన్ల వ్యాపారం మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నోకియా వ్యాపారం కూడా ఇదే సమయానికి మైక్రోసాఫ్ట్ అధీనంలోకి రానుంది. కాగా, భారతదేశంలోని మంగళూరు యూనివర్సిటీలోనే చదువుకున్న సత్య నాదెళ్ల అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సిఇఒగా ఫిబ్రవరిలో నియమితులవగా, ఇప్పుడు అదే యునివర్సిటీలో ఇంజినీరింగ్ చేసిన రాజీవ్ సూరి నోకియా సిఈఓ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతేగాక అంతర్జాతీయ కంపెనీలకు సిఈఓలుగా ఉన్న భారతీయుల జాబితాలో సూరి సైతం స్థానం సంపాదించుకోనున్నారు. ఇప్పటికే పెప్సీకో చైర్పర్సన్గా ఇంద్రా నూరుూ, డ్యూషే బ్యాంక్ సిఇఒగా అన్షూ జైన్, రెకిట్ బెన్కిజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాకేష్ కపూర్, మాస్టర్కార్డ్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ బంగా తదితరులున్నారు. 1967లో జన్మించిన రాజీవ్ సూరి.. 2009 నుంచి నోకియా సొల్యూషన్స్, నెట్వర్క్స్ అధిపతిగా పనిచేస్తున్నారు. కంపెనీ లాభాలు పెంచడానికి, పునర్వ్యవస్థీకరణకు ఈయన తీసుకున్న నిర్ణయాలు బాగా కలిపి వచ్చినట్టు చెబుతున్నారు.
అంతర్జాతీయంగా స్ట్రాటజీ, విలీనాలు, కొనుగోళ్లు, ప్రాడక్ట్ మార్కెటింగ్, సేల్స్, మేజర్ అకౌంట్ లీడర్షిప్, రీజినల్ అండ్ బిజినెస్ యూనిట్ లీడర్షిప్ వంటి విభాగాల్లో సూరి 23 ఏళ్ల అనుభవాన్ని సంపాదించారు రాజీవ్ సూరి. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, యూరప్వంటి రీజియన్లలో పని చేశారు. 1995లో నోకియాలో చేరిన సూరి 2007 సంవత్సరంలో నోకియా ఎన్ఎస్ఎన్ ఆసియా పసిఫిక్ రీజియన్ను హెడ్గా పని చేశారు.


Click it and Unblock the Notifications


