ఇండియా ఏవియేషన్: విమానాల సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఈ ఏవియేషన్ షోలో పలు దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.

ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో మారుమూల ప్రాంతాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అజిత్ సింగ్ చెప్పారు. ఇందులో ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. విమానాశ్రయాల అభివృద్ధికి 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రభుత్వం 1,210 కోట్ల డాలర్లు (75 వేల కోట్ల రూపాయలు) కేటాయించిందని, ఇందులో ప్రైవేటు రంగం వాటాగా 930 కోట్ల డాలర్లు (58 కోట్ల రూపాయలు) ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం విమానయాన రంగంలో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇండియా 2020 నాటికి మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని అజిత్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి 1.21 కోట్ల మంది ప్రయాణికులను దేశీయ గమ్యాలకు, 41 లక్షల మంది ప్రయాణికులను అంతర్జాతీయ గమ్యాలకు చేరుస్తున్న భారత విమానయాన రంగం 2020 నాటికి 3.36 కోట్ల మందిని దేశీయంగాను, 85 లక్షల మందిని అంతర్జాతీయ గమ్యాలకు చేర్చగల స్థాయికి పెరుగుతుందని అంచనాగా ఆయన తెలిపారు.

ఈ వృద్ధికి దీటుగా కొత్త విమానాశ్రయాల నిర్మాణం చేపట్టడంతో పాటు ప్రస్తుత విమానాశ్రయాలను విస్తరించడం, ఆధునికీకరించడం అవసరమని తెలిపారు. అంతకు ముందు నరసింహన్ మాట్లాడుతూ చిన్న పట్టణాలకు కనెక్టివిటీ పెంచడంపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలని, అలాగే ప్రయాణికుల సంపూర్ణ భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌర విమానయాన సంస్థ ఎదుగుదలలో ఆంధ్రప్రదేశ్ తన వంతు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవం

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు.

విమాన సంస్థల సిబ్బంది

విమాన సంస్థల సిబ్బంది

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విమానయాన సంస్థల సిబ్బంది వారందించే సేవల గురించి వివరించారు.

ఏమిరేట్స్ విమానం

ఏమిరేట్స్ విమానం

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహంతో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సందడి చేసిన భారీ ఏమిరేట్స్ విమానం.

అజిత్ సింగ్‌తో గవర్నర్ నరసింహన్

అజిత్ సింగ్‌తో గవర్నర్ నరసింహన్

దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాలతోపాటు తృతీయ శ్రేణి నగరాల్లోనూ విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ అన్నారు.

సందర్శకుల సందడి

సందర్శకుల సందడి

ఏవియేషన్ షోలో భారీ ఏమిరేట్స్ విమానాన్ని చూసేందుకు అక్కడి చేరుకున్న యువకులు. ఫొటోలు తీసేందుకు వారు పోటీపడ్డారు.

వివిధ దేశాలకు చెందిన విమానాలు

వివిధ దేశాలకు చెందిన విమానాలు

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో సందడి చేస్తున్న వివిధ దేశాలకు చెందిన విమానాలు.

నమూనా హెలికాప్టర్లు

నమూనా హెలికాప్టర్లు

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో సందడి చేస్తున్న వివిధ రకాల చిన్న విమానాలు, హెలికాప్టర్ల నమూనాలు.

సేవలు వివరిస్తూ..

సేవలు వివరిస్తూ..

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఆయా దేశాలకు చెందిన సంస్థల సేవలు, పనితీరును సిబ్బంది వివరించారు.

నమూనా ఎయిర్‌బస్

నమూనా ఎయిర్‌బస్

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన నమూనా ఎయిర్‌బస్.

పైలట్ క్యాబిన్

పైలట్ క్యాబిన్

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.

విమానం లోపలి భాగం

విమానం లోపలి భాగం

ప్రస్తుతం విమానయాన రంగంలో ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉన్న ఇండియా 2020 నాటికి మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని అజిత్ సింగ్ చెప్పారు.

ఏ-380 విమానంలో..

ఏ-380 విమానంలో..

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఏ-380 విమానంలోపలి బిజినెస్ తరగతి.

విలాసవంతమైన ప్రయాణం

విలాసవంతమైన ప్రయాణం

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఓ విదేశీ విమానంలోపలి తరగతిలో ఉన్న విలాసవంతమైన ఏర్పాట్లు.

విమానంలో విందు

విమానంలో విందు

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ఆయా దేశాలకు చెందిన సంస్థల సేవలు, పనితీరును సిబ్బంది వివరించారు.

ప్రదర్శనలో విమానాలు..

ప్రదర్శనలో విమానాలు..

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.

చిన్న విమానాలు

చిన్న విమానాలు

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి.

గగనంలో..

గగనంలో..

బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ‘ఇండియా ఏవియేషన్ 2014' అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ దేశాలకు చెందిన విమానాలు సందడి చేశాయి. ప్రభుత్వం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో మారుమూల ప్రాంతాల కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అజిత్ సింగ్ చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+