ఆల్‌టైమ్ హై: భారత మార్కెట్ల సరికొత్త రికార్డు

ముంబై: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం, క్యాడ్ అదుపులోకి రావడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచడంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డులను సృష్టించాయి. బొం బాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. 237.01 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 21513.87 పాయింట్ల వద్ద, నిఫ్టీ 72.50 పాయింట్ల వృద్ధితో 6401.15 వద్ద స్థిరపడ్డాయి. బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్స్ఛేంజీల చరిత్రలో ఇవే గరిష్ఠ స్థాయిలు కావడం విశేషం.

స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా దూసుకుపోవడానికి ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) కొనుగోళ్లు పెరగడం, కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) తగ్గడం వంటి పరిణామాలు తోడ్పడ్డాయి. గురువారం సానుకూల దృక్పథంతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే సాగింది. ఒక దశలో 21525.14 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోల్చితే 1.11 శాతం వృద్ధితో 21513.87 పాయింట్ల వద్ద ముగిసింది. ఒకవిధంగా చెప్పాలంటే సెన్సెక్స్ రెండు రికార్డులు(నూతన ఇంట్రాడే హై, ముగింపు స్థాయి) సృష్టించింది.

2014 జనవరి 23న ఇంట్రాడేలో సెన్సెక్స్ 21,373.66 పాయింట్లను తాకి ఆల్‌టైం గరిష్ట ముగింపు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత నష్టాలను చవిచూస్తూ అంతంత మాత్రం వృద్ధికే పరిమితమైంది. ఈ మధ్యకాలంలో ఎఫ్ఐఐల పెట్టుబడులు పెరగడంతో సెన్సెక్స్ మళ్లీ పుంజుకోవడం మొదలైంది. గత మూడు రోజుల్లోనే సెన్సెక్స్ 567.22 పాయింట్లు పెరిగింది. తాజా పరిస్థితులను చూస్తుంటే.. మరికొద్ది రోజులు మార్కెట్లలో ర్యాలీ ఉండవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

Sensex, Nifty attain record closing high

అంతేగాక అంతర్జాతీయ పరిణామాలతోపాటు 16వ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలు భారత మార్కెట్లను ముందుకు నడిపించేందుకు దోహదపడతాయని వారు చెబుతున్నారు. లాభాల్లో 24 సెన్సెక్స్ షేర్లు గురువారంనాటి ర్యాలీలో సెన్సెక్స్ సూచీలోని 24 షేర్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు, ఆర్ఐఎల్, ఎల్ అండ్ టి, హిందాల్కో, భెల్‌లు ఎక్కువ లాభాలను నమోదు చేసుకున్నాయి.

సెన్సెక్స్ సూచీలో లాభపడిన 24 షేర్లలో హిందాల్కో 4.33 శాతం, భెల్ 3.78 శాతం, ఐసిఐసిఐ బ్యాంకు 3.33 శాతం, ఒఎన్‌జిసి 2.91 శాతం, టాటా స్టీల్ 2.38 శాతం, ఎన్‌టిపిసి 2.37 శాతం, గెయిల్ ఇండియా 2.32 శాతం, సెసా స్టెరిలైట్ 2.22 శాతం, కోల్ ఇండియా 2.15 శాతం, హీరో మోటోకార్ప్ 2.03 శాతం, బజాజ్ ఆటో 1.93 శాతం, ఆర్ఐఎల్ 1.87 శాతం, మారుతి సుజుకీ 1.70 శాతం, ఎల్ అండ్ టి 1.66 శాతం, డాక్టర్ రెడ్డీస్ లాబ్ 1.27 శాతం లాభంతో ముగిశాయి.

సిప్లా, విప్రో షేర్లు నష్టాలపాలయ్యాయి. మొత్తం టర్నోవరు రూ. 2354.96 కోట్ల నుంచి రూ. 3692.06 కోట్లకు పెరిగింది. శుక్రవారం కూడా గురువారం కొనసాగిన ర్యాలీ కొనసాగే అవకాశాలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, హాంకాంగ్ మార్కెట్లు 0.22 శాతం నుంచి 1.59 శాతం వర కు లాభంతో ముగిశాయి.
.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+