సుబ్రతా రాయ్కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్కి సుప్రీం కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది.
సుబ్రతా రాయ్ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది.
తమ పరిధి చాలా ఎక్కువ అని ఆ సమయంలో కోర్టు పేర్కొంది. పెట్టుబడిదారులకు సంబంధించిన రూ. 20వేల కోట్లను తిరిగి చెల్లించనందున తమ ముందు హాజరు కావాలని సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆదేశించింది.