చెన్నై/న్యూఢిల్లీ: అసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా లక్ష్మీ స్వామినాథన్ ఎన్నికయ్యారు. ఈమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనునాన్నరని ఎడిబి ఒక ప్రకటనను విడుదల చేసింది. లక్ష్మీ స్వామినాథన్ ట్రిబ్యునల్కు ఎన్నికైన ఏడవ ప్రెసిడెంట్ కాగా, ట్రిబ్యునల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి భారతీయ వ్యక్తి కూడా ఈమే కావటం గమనార్హం.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన 35వ వార్షిక సమావేశంలో జస్టిస్ లక్ష్మీ స్వామినాథన్ను ప్రెసిడెంట్గా, ప్రొఫెసర్ రాయ్ లూరుూస్ను వైస్ ప్రెసిడెంట్గా ట్రిబ్యునల్ ఎన్నుకుందని ఎడిబి తన ప్రకటనలో పేర్కొంది. ఇంతకుముందు ప్రెసిడెంట్లుగా పనిచేసిన ఆరుగురిలో అమెరికా నుంచి ఇద్దరు, ఫిలిప్పీన్స్ నుంచి ఇద్దరు, శ్రీలంక, బ్రిటన్లనుంచి ఒక్కొక్కరు ఎన్నికయ్యారు. ఇక 2010లో లక్ష్మీ స్వామినాథన్ ట్రిబ్యునల్లో సభ్యులుగా చేరగా, ఆగస్టు 2013 వరకు ట్రిబ్యునల్ తాత్కాలిక ప్రెసిడెంట్గా బాధ్యతలను నిర్వహించారు.

ఆర్బిఐకి మద్రాస్ హైకోర్టు నోటీసులు
చెన్నై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు శనివారం మద్రాస్ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను తిరిగి ఇచ్చేసి, వాటి స్థానంలో కొత్త నోట్లను తీసుకోవాలంటూ ఇటీవల ఆర్బిఐ జారీ చేసిన నోటిఫికేషన్ అభ్యంతరకరంగా, అయోమయంగా ఉందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారించిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
జనవరి 28న జారీ చేసిన ఈ నోటిఫికేషన్లో సరైన కారణాలు పేర్కొనలేదని తద్వారా ప్రజలు ఆయోమయానికి గురవుతున్నారని ఎస్ శ్రీనివాసన్ నారాయణన్ అనే న్యాయవాది మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారించిన న్యాయస్థానం ఆర్బిఐకి నోటీసులు జారీ చేసింది.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications