అమెరికా అండ: డాక్టర్ రెడ్డీస్ దూకుడు

 Dr Reddy
హైదరాబాద్: దేశీయ ఔషధ రంగ దిగ్గజ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఏకీకృత నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 70 శాతం పెరిగాయి. అక్టోబర్-డిసెంబర్ వ్యవధిలో రూ.618.42 కోట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే నికరలాభం 70 శాతం పెరిగి 363.31 కోట్ల నుంచి 618.42 కోట్లకు చేరింది. ప్రపంచ విపణిలో జనరిక్ ఔషధాల అమ్మకాలు 41 శాతం పెరిగినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.

ప్రధానంగా అమెరికా మార్కెట్‌లో తాము విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ ఔషధాల అమ్మకాలు ఈ వృద్ధికి ఊతం ఇచ్చాయని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి మంగళవారం తెలిపారు. మూడో త్రైమాసికంలో ఉత్తర అమెరికా, ఇతర వర్థమాన మార్కెట్లలో అమ్మకాలు జోరుగా సాగాయని కంపెనీ జనరిక్స్ విభాగం ప్రెసిడెంట్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. యూరోపియన్ మార్కెట్లు మాత్రం కొంత నీరసంగానే ఉన్నాయని, అక్కడ చెప్పుకోదగినంత వృద్ధిని సాధించలేకపోతున్నామని ఆయన తెలిపారు.

భవిష్యత్‌లో కూడా యూరోపియన్ మార్కెట్ తమ అమ్మకాలకు ఊతం లభించకపోవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మూడో త్రైమాసికంలో తమ కంపెనీ ఏడు కొత్త జనరిక్ ఔషధాలను విడుదల చేసిందని, మార్చి చివరిలోగా మరో రెండు కొత్త ఔషధాలు విడుదల కావచ్చునని అభిజిత్ ముఖర్జీ చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని కొత్త జనరిక్ ఔషధాలు విడుదల చేయడంపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.

మూడో త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 23 శాతం వృద్ధితో 2,865.16 కోట్ల నుంచి 3,533.76 కోట్ల రూపాయలకు పెరిగిందని సౌమెన్ చక్రవర్తి తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతోనే ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో డాక్టర్ రెడ్డీస్ 9,740 కోట్ల రూపాయల ఆదాయంపై 2,520 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. ఈ తొమ్మిది మాసాల కాలంలో ఆదాయాల్లో 17.5 శాతం, లాభంలో 36 శాతం వృద్ధి నమోదు చేసింది.

ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా ప్రాంతంలో అమ్మకాలు భారీ స్థాయిలో 76 శాతం పెరగ్గా, రష్యా, సిఐఎస్ వంటి వర్థమాన మార్కెట్లలో 25 శాతం వృద్ధి చోటు చేసుకుందని సౌమెన్ చక్రవర్తి తెలిపారు. అయితే భారత్‌లో మాత్రం కొత్త ఫార్మా ధరల విధానం కింద సద్దుబాట్ల కారణంగా పరిమిత స్థాయిలో ఐదు శాతం వృద్ధి మాత్రమే చోటు చేసుకున్నదన్నారు.

డాక్టర్ రెడ్డీస్ ఆర్ అండ్ డి ఫోకస్ గల కంపెనీగానే తన గుర్తింపును కొనసాగించుకుంటుందని సౌమెన్ తెలిపారు. మూడో త్రైమాసికంలో తాము ఆర్ అండ్ డిపై 300 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఈ విభాగంపై పెట్టుబడి వెయ్యి కోట్లు దాటవచ్చునని ఆయన అంచనా వేశారు. అయితే డాక్టర్ రెడ్డీస్ ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ మదుపరులను ఆకర్షించలేకపోయింది. మంగళవారం ఎన్ఎస్ఈలో రూ. 2,699 గరిష్ట ధర పలికిన రెడ్డీస్ షేరు ఒక దశలో రూ. 2,625కు పడిపోయింది. ఆ తర్వాత కొంతమేర కోలుకుని రూ. 2,660 వద్ద ముగిసింది. ఇది సోమవారంతో పోల్చితే రూ. 11.20 తక్కువ కావడం గమనార్హం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+