‘హీలర్’ పుస్తకావిష్కరణలో రామ్‌చరణ్ సందడి(పిక్చర్స్)

హైదరాబాద్: అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ గుప్తా రచించారు. ప్రతాప్ సి రెడ్డి జీవితంలోని పలు విశేషాల్ని, ముఖ్య ఘటనలను ఆయన ఈ పుస్తకంలో వివరించారు. పుస్తక తొలి ప్రతిని ప్రతాప్ సి రెడ్డి సతీమణి సుచరితా రెడ్డికి ఆయన అందజేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సినీ నటుడు రామ్‌చరణ్ దంపతులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు మెరుగైన వైద్యం కోసం భారతీయులు అమెరికాకు వెళ్లేవారని, ప్రస్తుతం అమెరికాతోపాటు దాదాపు 150 దేశాలకు చెందిన పౌరులు మనదేశానికి వస్తున్నారని తెలిపారు. 1979లో ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కులేకుండా మారిన ఘటన తనను ఎంతో కలచివేసిందని ఆయన తెలిపారు. ఈ ఘటనతోనే తాను మెరుగైన వైద్య సేవలను మనదేశంలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

డాక్టర్ ప్రతాప్ రెడ్డితో జిఎన్ రావు

డాక్టర్ ప్రతాప్ రెడ్డితో జిఎన్ రావు

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో ప్రముఖ వైద్యులు జిఎన్ రావు (ఎల్‌వి ప్రసాద్ ఐ హాస్పిటల్).

మంత్రి జానారెడ్డి

మంత్రి జానారెడ్డి

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డితో రాష్ట్ర మంత్రి జానారెడ్డి.

కెవిపి రామచంద్రరావు

కెవిపి రామచంద్రరావు

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్న ఎంపి కెవిపి రామచంద్రరావు.

సతీమణితో ప్రతాప్ సి రెడ్డి

సతీమణితో ప్రతాప్ సి రెడ్డి

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఆయన సతీమణి సుచరితారెడ్డితో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి.

నిర్మాత రామానాయుడు

నిర్మాత రామానాయుడు

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. ఈ సందర్భంగా హీలర్ పుస్తకాన్ని ప్రముఖ నిర్మాత రామానాయుడుకు అందజేస్తున్న ప్రతాప్ సి రెడ్డి.

సినీ హీరో రామ్‌చరణ్

సినీ హీరో రామ్‌చరణ్

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. కార్యక్రమానికి హాజరైన సినీ హీరో రామ్‌చరణ్, అనిల్ కామినేని, కృష్ణన్ బాబు, జయేష్ రంజన్.

రచయితతో రామ్‌చరణ్

రచయితతో రామ్‌చరణ్

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. రచయిత ప్రణయ్ గుప్తా నుంచి పుస్తకం స్వీకరిస్తున్న రామ్‌చరణ్.

పుస్తకంతో రామ్‌చరణ్

పుస్తకంతో రామ్‌చరణ్

అపోలో గ్రూప్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్-ది ట్రాన్స్‌ఫార్మెషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణ బుధవారం నగరంలోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీలో జరిగింది. ఈ సందర్భంగా హీలర్ పుస్తకాన్ని చూపుతున్న రామ్‌చరణ్.

ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రి కె జానారెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే దక్కుతుందని అన్నారు. వృత్తికే వన్నే తీసుకొచ్చి, రాష్ట్రం గర్వపడేలా కృషి చేశారని జానారెడ్డి కొనియాడారు. ఈ పుస్తకం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన అన్నారు. గత 30 ఏళ్లుగా దాదాపు 57 రకాల వైద్య సౌకర్యాల ద్వారా 37 మిలియన్ల మంది ప్రజల జీవితాల్ని అపోలో హాస్పిటల్స్ కాపాడాయని పుస్తక రచయిత ప్రణయ్ గుప్తా వివరించారు.

రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు, ప్రముఖ సినీ నిర్మాత డి రామానాయుడు, అక్కినేని అమల, హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, సిఈఓ డాక్టర్ కె హరిప్రసాద్, సిఓఓ వై సుబ్రహ్మణ్యం, ప్రముఖ వైద్యులు జిఎన్ రావు (ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్), డాక్టర్ ఎవిత ఫెర్నాండేజ్ (ఫెర్నాండేజ్ హాస్పిటల్), డాక్టర్ మోహన్ వంశీ (ఒమెగా హాస్పిటల్స్), డాక్టర్ గోపిచింద్ (స్టార్ హాస్పిటల్స్) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+