నారాయణమూర్తి మంత్రం: లాభాల్లో ఇన్ఫోసిస్

బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణ మూర్తి తిరిగి రావడంతో ఆ కంపెనీ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది. దేశీయ ఐటిరంగ దిగ్గజ సంస్థల్లో ద్వితీయ స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ సంస్థ నికర లాభాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 21 శాతం పెరిగాయి. ఈ మేరకు ఇన్ఫోసిస్ శుక్రవారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

దేశీయ ఐటిరంగ సంస్థల ఎగుమతులకు కీలక మార్కెట్లైన అమెరికా, ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు వ్యక్తమవుతుండటంతో ఔట్‌సోర్సింగ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ మధ్య ఇన్ఫోసిస్ రెవిన్యూ వృద్ధి ఔట్‌లుక్ సైతం ఎగబాకింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో నికర లాభం 2,875 కోట్ల రూపాయలుగా నమోదైనట్లు ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. కాగా అంతకుముందు ఏడాది ఇదే వ్యవధిలో 2,369 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఇన్ఫోసిస్ నమోదు చేసింది.

Infosys surprises Street again with 21% rise in net

ఆదాయం 25 శాతం పెరిగి 10,424 కోట్ల రూపాయల నుంచి 13,026 కోట్ల రూపాయలకు ఎగిసినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. మూడో త్రైమాసికం పనితీరు సంతోషకరంగా ఉందని ఇన్ఫోసిస్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌డి శిబులాల్ అన్నారు. 1.7 శాతం వృద్ధిని సాధించామని ఆయన తెలిపారు. రెవిన్యూ 2.1 బిలియన్ డాలర్లకు చేరిందని చెప్పారు. ఆన్‌సైట్ 3.4 శాతం పడిపోగా, ఆఫ్‌షోర్ మాత్రం ఏకంగా 2.6 శాతం పెరిగిందన్నారు. ఈ ఫలితాలు గత రెండు త్రైమాసికాల్లో తాము తీసుకున్న చర్యలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 54 మంది కొత్త క్లయింట్లు వచ్చారని చెప్పారు.

కాగా మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికిగానూ రెవిన్యూ వృద్ధి అంచనాను 24.4 శాతం నుంచి 24.9 శాతానికి ఇన్ఫోసిస్ పెంచింది. ఇంతకుముందు ఇది 21-22 శాతంగా ఉండేది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో ఇన్ఫోసిస్ షేర్ల విలువ శుక్రవారం 2.73 శాతం పెరిగి 3,545.35 రూపాయలకు చేరుకుంది. ఇన్ఫోసిస్ రెవిన్యూ అంచనాలను అందుకోగా, లాభాలు మాత్రం మించిపోయాయని కొటాక్ సెక్యురిటీస్ ప్రైవేట్ క్లైయింట్ గ్రూప్ రీసెర్చ్ అధిపతి దీపెన్ షా పేర్కొన్నారు. ఇదిలావుంటే ఇన్ఫోసిస్ తాజా రెవిన్యూలో ఉత్తర అమెరికా నుంచి 60 శాతం, ఐరోపా దేశాల నుంచి 24.9 శాతం వచ్చింది. సంస్థ ఉద్యోగులు ఈ త్రైమాసికంలో 6,682 మంది పెరిగడం గమనార్హం.

మంచే జరగాలి: నారాయణ మూర్తి

ఇంతకుముందన్నడూ లేనివిధంగా సంస్థ నుంచి పెద్ద ఎత్తున సీనియర్లు వైదొలగారని.. వారందరికీ మంచే జరగాలని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ఆకాంక్షించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికీ సంస్థలో సమర్థులకు కొదవ లేదని అన్నారు. గత ఏడాది జూన్‌లో నారాయణ మూర్తి సంస్థలోకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన రాకతో మదుపర్లలో ఇన్ఫోసిస్‌పట్ల విశ్వాసం మరింత పెరగగా, స్టాక్‌మార్కెట్‌లో సంస్థ షేర్ల విలువ కూడా భారీగానే పెరిగింది.

తన కుమారుడు రోహన్ కంపెనీలో ఉన్నత స్థానం కోసం తయారవుతున్నారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం రోహన్ హార్వర్డ్‌కు సెలవులు పెట్టారని, సరైన సమయంలో తిరిగి వెళతారని నారాయణమూర్తి చెప్పారు. ఇన్ఫోసిస్‌లో ఏ స్థానంలో రోహన్ ఉంటాడనేది తాను నిర్ణయించేది కాదని తెలిపారు. అతని భవిష్యత్‌పై తాను నిర్ణయం తీసుకోవడం సరికాదని నారాయణమూర్తి పేర్కొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+