
ఐఎస్జిలో జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు 27.55 శాతం వాటా ఉండగా, దాని అనుబంధ సంస్థ జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఓవర్సీస్ లిమిటెడ్కు మరో 12.45 శాతం వాటా ఉంది. కాగా మంగళవారం ఎంఎహెచ్బి మలేసియా స్టాక్ ఎక్చేంజిలో ఈ వివరాలను నమోదు చేసింది. జిఎంఆర్ వాటాను 225 మిలియన్ యూరోల(రూ.1,900 కోట్లు)కు కొనుగోలు చేయనున్నట్లు మలేసియా కంపెనీ వెల్లడించింది. టర్కీకి చెందిన లైమక్ కన్స్ట్రక్షన్ హోల్డ్స్కు మరో 40 శాతం వాటా ఉంది.
దీర్ఘకాలిక నిర్ణయాలతో మనుగడ
హైదరాబాద్: పరిశోధనే ప్రాణంగా డాక్టర్ అంజిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమించారని, ప్రపంచానికి ఒక అద్భుత ఔషధ కంపెనీని అందించారని డాక్టర్ రెడ్డీస్ లేబొరెటరీస్ చైర్మన్, సిఇఒ జివి ప్రసాద్ పేర్కొన్నారు. ఖరీదైన ఔషధాలు తక్కువ ధరకే అందించడం, ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా 1984లో అంజిరెడ్డి కంపెనీని ప్రారంభించారని ఆయన తెలిపారు. ‘ద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా)' మంగళవారం యార్లగడ్డ శ్రీరాములు పదో ధర్మనిధి ఉపన్యాసాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దీర్ఘకాలిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకుని వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సంస్థ మెరుగైన వృద్ధితో మనుగడ సాగించగలుగుతుందనిఅయితే ఇలాంటి నిర్ణయాల వల్ల స్వల్పకాలంలో ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతాయని, వాటిని తట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని ప్రసాద్ అన్నారు. 25 లక్షల రూపాయల మూలధనంలో ప్రారంభమైన డాక్టర్ రెడ్డీస్ లేబొరెటరీస్.. డాక్టర్ అంజిరెడ్డి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని తెలిపారు.
పరిశోధనా, అభివృద్ధి, నూతన ఔషధాల ఆవిష్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టి క్రమంగా వృద్ధి బాటలో సాగినట్టు ప్రసాద్ చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటూ సంక్షిష్టమైన ఔషధాలను సైతం అందుబాటులోకి తెచ్చామన్నారు.ఈ కార్యక్రమంలో మాలక్ష్మీ చైర్మన్ వై హరీశ్చంద్ర ప్రసాద్, ఐఈఐ ఛైర్మన్ జి. సుధాకర్, కార్యదర్శి కమలాకర్, రాధాకృష్ణమూర్తితోపాటు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications