పబ్లిక్ కంపెనీగా టాటా సియా ఎయిర్ లైన్స్
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్దనున్న సమాచారం ప్రకారం నవంబర్ 5న టాటా-సియా 5 లక్షల రూపాయలు మూలధనం చెల్లించి, సంబంధిత పత్రాలన్నింటినీ సమర్పించింది. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల వివరాలను, పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను అందజేసింది. సంయుక్త సంస్థలోని బోర్డులో డైరెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రసాద్ మీనన్తోపాటు కేర్సి రూస్టోమ్ భగత్, ముకుంద్ గోవింద్ రాజన్లు సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు.
కాగా సంయుక్త సంస్థలో 51 శాతం వాటాతో టాటా సన్స్ లిమిటెడ్, 49 శాతం వాటాతో సింగపూర్ ఎయిర్లైన్స్ కలిసి ఏర్పాటైన సంయుక్త సంస్థే టాటా-సియా ఎయిర్లైన్స్ లిమిటెడ్. ఇప్పటికే ఈ సంయుక్త సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రగతి బోర్డు (ఎఫ్ఐపిబి) ఆమోదం లభించగా, అనంతరం టాటా-సియా ఎయిర్లైన్స్ లిమిటెడ్ పేరును వెంచర్ ఉపయోగించుకోవచ్చని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా అనుమతిచ్చింది.
కాగా దేశీయంగా విమానయాన సేవలు అందించేందుకు ఎయర్ ఆసియా సంస్థతోనూ టాటా గ్రూప్ జాయంట్ వెంచర్ను నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సంయుక్త సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పత్రాలన్నింటినీ సమర్పించి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా టాటా-సియా ఎయిర్లైన్స్ లిమిటెడ్ అవతరించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా సంయుక్త సంస్థలో విమానాలను నడపనున్నారు.