చౌక రుణాలతో పండగలకు పండగే

Chidambaram
న్యూఢిల్లీ: పండగ సీజన్‌లో ప్రజలకు ప్రభుత్వ చర్యలు ఊరట కలిగించేలా ఉన్నాయి. వినియోగదారులు కొత్త టెలివిజన్లను, రిఫ్రిజిరేటర్లను, ఇతర దీర్ఘకాలం మన్నే వినియోగ వస్తువులను, వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీరేటుకే మరిన్ని రుణాలను అందించనున్నాయి. ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వినియోగదారులకు శుభవార్తగానే చెప్పవచ్చు.

ఢిల్లీలో ఆర్థిక మంత్రి పి చిదంబరం, ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య గురువారం జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాటా మూలధనాన్ని పెంచడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు రూ. 14 వేల కోట్లు ఇవ్వాలని బడ్జెట్‌లో నిర్ణయించారు. నిర్ణీత మొత్తం కన్నా ఎక్కువ మూలధనం నిధులు లభిస్తే.. మరిన్ని రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం ఉంటుంది.

బ్యాంకులకు కేటాయించే అదనపు నిధులు వృద్ధి మాంద్యాన్ని ఎదుర్కోవడానికి, ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇది వినియోగదారులకు ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఊరట కల్పించడంతో పాటు ఉత్పాదన సామర్థ్యం పెంపునకు, ఉత్పత్తి పెంచడానికి కూడా ఇది దోహదపడుతుందని తెలిపింది.

సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాల్లో రుణ వృద్ధిపై చర్చించారు. అయితే బ్యాంకులకు సమకూర్చే అదనపు మూలధనం ఎంత అనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. 2013 సెప్టెంబర్ చివరి నాటికి స్థూలంగా బ్యాంక్ రుణాల వృద్ధి నిరుటితో పోలిస్తే 18 శాతం పెరిగింది. కొన్ని రంగాల్లో రుణ వృద్ధి మాత్రం అంతగా లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ రంగాల్లో డిమాండ్ ఇప్పటికీ స్తబ్దుగా ఉందనే విషయం తెలుస్తోందని ఆర్థిక శాఖ తెలిపింది.

తాజాగా ప్రకటించిన పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను బట్టి నిరుటి జూలై నెలలో 0.8శాతం వృద్ధిని నమోదు చేసిన కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగం ఉత్పత్తి ఈ ఏడాది అదే నెలలో 9 శాతం తగ్గింది. నిరుడు ఇదే నెలలో ఈ రంగం ఉత్పత్తి 0.8శాతం పెరిగింది. ఏప్రిల్-జులై నెలల్లో ఈ రంగ ఉత్పత్తి 12శాతం తగ్గింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 6.1శాతం పెరిగింది. అంటే టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు లాంటి వాటికి డిమాండ్ తగ్గినట్లు అర్థమవుతుంది. కాగా, నిరుడు ఏప్రిల్- ఆగస్టు మధ్య కాలంలో 6.8 శాతం వృద్ధిని నమోదు చేసిన ద్విచక్ర వాహనాల రంగం ఈ ఏడాది అదే సమయంలో కేవలం నామమాత్రంగా 0. 72 శాతం వృద్ధినే నమోదు చేసింది.

గురువారం జరిగిన చర్చల ఆధారంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమకూర్చే మూలధనాన్ని పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని ఆర్థిక శాఖ పేర్కొంది. శుక్రవారం రాయ్‌పూర్‌లో రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశం జరగడానికి ముందు బ్యాంకులకు అదనపు మూలధనాన్ని సమకూర్చాలన్న నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+