అమెరికా షట్ డౌన్: మన ఎగుమతులకు దెబ్బ!

వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇప్పుడిపపుడే మందగమనం నుంచి కోలుకుంటున్నామంటూ.. ఉద్దీపనలు ఉపసంహరించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించిన అమెరికాకు మరో సమస్య ఎదురైంది. అదేమిటంటే.. అమెరికా వార్షిక బడ్జెట్ ఆమోదంపై పార్లమెంట్‌లో తలెత్తిన ప్రతిష్ఠంభన పెను సంక్షోభానికి దారితీసింది. అమెరికా ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేత (షట్ డౌన్)తో భారత్ ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బడ్జెట్ ఆమోదించడంలో స్తంభన నెలకొనడం కారణంగా ఖర్చులకు డబ్బు లేకపోవడంతో పలు ఫెడరల్ ప్రభుత్వ సంస్థలను పాక్షికంగా మూసివేయాల్సిందిగా (షట్ డౌన్) అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యకలాపాలు(అత్యవసర, నిత్యావసర సేవలు మినహా) నిలిచిపోనున్నాయి. ఒబామా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరోగ్య సర్వీసుల బిల్లుపై డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. సోమవారం రాత్రి వరకు ఉభయ పక్షాల మధ్య రాజీకి విఫల ప్రయత్నాలు జరిగాయి.

US government shutdown chokes Washington

బడ్జెట్ ఆమోదానికి రిపబ్లికన్లు దిగిరాకపోవడంతో కాంగ్రెస్ తన విధి నిర్వహించలేకపోయిందని ఒబామా తెలిపారు. బడ్జెట్ ఆమోదంలో విఫలమైన కారణంగా ప్రభుత్వ సంస్థల్లో అత్యధిక భాగం మూసివేయాల్సి వస్తోందని అన్నారు. కాంగ్రెస్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేవరకు ఈ పరిస్థితి కొనసాగక తప్పదని ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా తీసుకున్న నిర్ణయంతో 8 లక్షల మంది ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల్లేకుండా ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూసివేత కొనసాగినంతకాలం వారు వేతనాల్లేని సెలవులో ఉంటారు. ఈ ప్రభావం భారత ఎగుమతులపై కూడా తప్పక ఉంటుందని పారిశ్రామిక విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత ఎగుమతిదారులను అమెరికా తీసుకున్న నిర్ణయం ఇబ్బందులు పెడుతుందని ఇంజినీరింగ్ ఎగుమతుల సంస్థ ఈఈపీసీ ఇండియా పేర్కొంది. నౌకాశ్రయాలు, కార్గో, నియంత్రణ సంస్థల అనుమతుల ప్రభావంతో సరుకును అక్కడే నిలిపేయాల్సి వస్తుందని చెబుతోంది. అంతేగాక కొనుగోలుదార్లు కొత్త ఆర్డర్లను వాయిదా వేసే అవకాశం ఉందని పేర్కొంది. పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో సర్వీసులకు అంతరాయం కలుగుతుందని దానివల్ల ఎగుమతులు దెబ్బతింటాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ అన్నారు. భారత్ ఎగుమతులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో అమెరికా షట్ డౌన్ ప్రకటించడంపై ఎగుమతిదారులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

కాగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 101.05 డాలర్లకు పడిపోయింది. అయితే అమెరికా షట్ డౌన్ వల్ల భారత ఐటి రంగంపై తక్షణ ప్రభావం ఏమీ ఉండదని నాస్కామ్ వెల్లడించింది. దేశీయ ఐటి రంగం ప్రధానంగా ప్రైవేట్ రంగంపై ఆధారపడి ఉందని, అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఎక్కువగా ఉండవని వెల్లడించింది. భారత వస్తువుల, సేవలను దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసింది.

అమెరికా ఇంతకముందు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. 1976 నుంచి కనీసం 17 సందర్భాల్లో ప్రభుత్వం షట్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. 1996 డిసెంబర్ నుంచి 1997 జనవరి మధ్య 21 రోజుల పాటు షట్‌డౌన్ చేయాల్సి వచ్చింది. షట్‌డౌన్ కారణంగా బిల్ క్లింటన్ ప్రభుత్వంపై 200 కోట్ల డాలర్ల అదనపు భారం పడినట్టుగా విశ్లేషించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+