
వినియోగదారులు తమ ప్రమేయం లేకుండానే పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) వద్ద లావాదేవీలు జరిగాయని ఫిర్యాదు చేసినట్లయితే 3 రోజుల్లోగా బ్యాంకులు పిఓఎస్ను పరిశీలించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు సూచించిన విధంగా కార్డుల సురక్షిత వినియోగానికి ఏర్పాట్లు చేయకపోతే ఏడు పని దినాల్లోపు ఖాతాదారుకు నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా చేయకపోతే 8వ రోజు నుంచి రోజుకు 100 రూపాయల చొప్పున బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ నిబంధనల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న వ్యాపార సంస్థల వరకు డెబిట్, క్రిడిట్ కార్డులను స్వైప్ చేసే పిఓఎస్ యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9.50లక్షల పిఓఎస్ యంత్రాలను వివిధ బ్యాంకులు జారీ చేసినట్లు సమాచారం. టెలిఫోన్ లైన్ ద్వారా లేదా సిమ్ కార్డు ఆధారంగా జిపిఆర్ఎస్ పద్ధతిలో పిఓఎస్ యంత్రాలను ఇంటర్నెంట్కు అనుసంధానం చేయడం జరుగుతుంది.
డెబిట్, క్రికెట్ కార్డులతో స్వైప్ చేసినప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించిన సమాచారం ఓపెన్ సర్వర్ ద్వారా ఇతరులు సంగ్రహించే అవకాశం ఉండడంతో కార్డులోని సమాచారాన్ని పేమెంట్ గేట్ వేలోని సర్వర్కు చేరే ఏర్పాట్లు చేయాలని గతంలో రిజర్వు బ్యాంకు సూచించింది. ఆర్బిఐ సూచించిన విధంగా చర్యలు చేపట్టినట్లయితే ఆ సమాచారాన్ని ఎవరూ గ్రహించేందుకు వీలుపడదు. కాగా అక్టోబర్ 1నుంచి వినియోగదారుల కార్డుల లావాదేవీలకు రక్షణ కల్పించని పక్షంలో ఏవైనా తప్పులు జరిగినట్లయితే వాటికి సంబంధిత బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications