రఘురాం రాజన్ మార్క్, రెపో రేటు పెంపు

RBI raises interest rates, sensex down over 500 points
ముంబై: భారత రిజర్వు బ్యాంక్(ఆర్‌బిఐ) పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెలువరించింది. ఆర్‌బిఐ వడ్డీ రేటును 0.75శాతం తగ్గించింది. రెపో రేటును 0.25 పెంచింది. నగదు నిల్వల నిష్పత్తి యధాతథంగా 4శాతంగానే ఉంచింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బిఐ ఎంఎస్ఎఫ్ 10.25శాతం ఎత్తివేసింది.

రివర్స్ రెపో రేటును ఎల్ఏఎఫ్ ప్రమాణాల ప్రకారం 6.5శాతంగా, బ్యాంక్ రేట్ ను 9.5శాతానికి తగ్గించింది. తక్షణమే ఈ సవరణ అమలులోనికి రానుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని ఆర్ బిఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణ నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తూ పారిశ్రామిక అభివృద్ధి కోసం సరైన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ద్రవ్యోల్పణాన్ని తగ్గించడం కోసమే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఆయన తెలిపారు.

మార్జినల్ స్టాండింగ్ ఫిసిలిటీ 75బేసిస్ పాయింట్లు తగ్గించడం ద్వారా 10.25శాతం నుంచి 9.25శాతానికి చేరింది. నగదు నిల్వల నిష్పత్తిలో మార్పులేమి చేయకుండా 4శాతంగానే ఉంచింది. ఎల్ఏఎఫ్ పాలసీ రెపో రేటును 25శాతం పెంచుతూ 7.25 బేసిస్ పాయింట్ల నుంచి 7.5శాతానికి తగ్గించడం జరిగింది.

అయితే మార్కెట్లు ఆర్‌బిఐ నిర్ణయాలకు ప్రతికూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టాలపాలయ్యాయి. డాలర్ తో రూపాయి మారకం విలువ 69పైసలు తగ్గి రూ.62.46కి చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలతో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకు కారణమైందని ఆయన అన్నారు. కరెంటు ఖాతా లోటు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం, ఆర్ బిఐ దశలవారిగా తీసుకునే చర్యలతో తగ్గించవచ్చని రఘురాం రాజన్ అన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+