
ఈ ఒప్పందం నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ-రవాణా రంగంలో వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని తోషిబా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తకేషి యోకోతా వెల్లడించారు. అంతేగాక వచ్చే ఐదేళ్లలో భారత్లో 20శాతం మార్కెట్ వాటాను సంపాదించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. 2015 వరకు విద్యుత్ పంపిణీ-రవాణా మార్కెట్ విస్తృస్థాయికి చేరి 4 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయగలదని తెలిపారు. తోషిబా ఇందుకోసం ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయనుంది. టీ అండ్ డీ సిస్టమ్స్కు సంబంధించిన తోషిబా అభివృద్ధి చేసిన అత్యాధునిక పరిజ్ఞానాన్ని కొత్త కంపెనీ అందుబాటులోకి తెస్తుంది.
విద్యుత్ పంపిణీ, ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేసే ఉద్దేశంతో 1973లో విజయ్ ఎలక్ట్రికల్స్ ప్రారంభమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేష్ ఈ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. విజయ్ ఎలక్ట్రికల్స్ విద్యుత్ ఉపకరణాల తయారీలో తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
విజయ్ ఎలక్ట్రికల్స్ 2006లో విద్యుత్ రవాణా-పంపిణీ (టీ అండ్ డీ) వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ట్రాన్స్ మిషన్ ట్రాన్స్ ఫార్మర్లు, స్విచ్ గేర్ తయారీతోపాటు అల్ట్రా-హైవోల్టేజీ 1200 కేవీ పవర్ ట్రాన్స్ ఫార్మర్లను తయారు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 6వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వార్షిక టర్నోవర్ 250 మిలియన్ డాలర్లు (రూ.1625 కోట్లు) ఉంది. తోషిబాతో తమ సంస్థతను సొంతం చేసుకుంటున్న పరిణామంపై విజయ్ ఎలక్ట్రికల్స్ సీఎండీ దాసరి జై రమేష్ మాట్లాడుతూ..అంతర్జాతీయ సంస్థ అయిన తోషిబాతో తమ సంస్థ, ఉద్యోగులు భాగస్వాములు కావడం తనకు సంతోషం కలిగిస్తోందని అన్నారు.
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications