
ప్రస్తుతం పెరిగిన ఇంధన ధరల కారణంగానే దేశీయ విమాన ప్రయాణ ఛార్జీలను 23 నుంచి 25శాతానికి పెంచుతున్నట్లు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు చెప్పారు. రూపాయి మారకం విలువ తగ్గడం ఆందోళన కలిగిస్తోందని, అంతర్జాతీయ పరిణామాలు కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయని తెలిపారు.
భవిష్యత్లో అంతర్జాతీయ మార్గాల్లో కూడా ప్రయాణ ఛార్జీలను పెంచే అవకాశం ఉందని తెలిపారు. భారత దేశంలో ఎయిర్ ఇండియా సుమారు 82శాతం ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తోందని తెలిపారు. పండగల సందర్భంగా ప్రయాణికులు ముందుగానే బుకింగ్ చేసుకోవాలన్నారు. జులైలో ఎయిర్ ఇండియా
19.2శాతం దేశీయ మార్కెట్ షేర్ను సాధించిందని తెలిపారు.
అయితే ఇప్పటికే స్పైస్ జెట్ విమానయాన సంస్థ 25శాతం ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందె. కాగా జెట్ ఎయిర్ వేస్ 25శాతం ప్రయాణ ఛార్జీలను బుధవారం పెంచింది. వివిధ అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి విలువ పతనం వంటి అంశాలు విమాన ఛార్జీలు పెంచేందుకు దోహదం చేస్తున్నాయని యాత్ర.కామ్ అధ్యక్షుడు శరత్ ధల్ తెలిపారు. బ్యాంకాక్, సింగపూర్, దుబాయి లాంటి దేశాలకంటే మన దేశంలో ఇంధన ధరలు 50నుంచి 60శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. పెరుగుతున్న ఇంధన ధరలు, బలహీనపడుతున్న భారత ఆర్థిక వ్యవస్థ దేశీయ విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం చూప్తిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications