చారిత్రక కనిష్ఠానికి చేరుకున్న రూపాయి పతనం 64.48

Rupee
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి స్దితి రోజురోజుకీ దిగజారిపోతుంది. ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు ఒకానొక దశలో లాభాల్లో ప్రారంభమైనప్పటికీ... కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం ఒక సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి 64.48 వద్ద ట్రేడ్ అయింది. గత కొంత కాలంగా ట్రేడ్ అయిన వాటితో పోల్చి చూస్తే ఇదే అత్యంత తక్కువ కావడం గమనార్హం. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కనిపించింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 340 పాయింట్లను కోల్పోయి 17,905 వద్ద ముగియగా.. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ మాత్రం 98 పాయింట్లను కోల్పోయి 5,302 వద్ద ముగిసింది.

ఇది ఇలా ఉంటే ప్రముఖ డ్యూచ్ బ్యాంక్ రూపాయి పతనం ఇంతటితో ఆగదని రాబోయే రోజుల్లో రూ. 70 వరకూ దిగజారతుందని అంచనా వేసింది. ఐతే రూపాయి పతనం శాశ్వతంగా ఉండదని.. దీనిపై అందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఆర్దిక విధానాలు రూపాయని బలపరిచే విధంగా లేకపోవడం.. మరో వైపు దేశానికి వచ్చే పెట్టుబడులు కూడా తగ్గిపోవడం రూపాయి మరింతగా పతనమవ్వడానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే దేశంలో మళ్లీ 1991 నాటి ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ప్రధాని మన్మోహాన్ సింగ్, ఆర్దిక మంత్రి చిదంబరంతో పాటు ఆర్దికవేత్తలు దీనిని ఖండిస్తున్నప్పటికీ.. పరిస్దితులు మాత్రం ఆ దిశగానే ఉన్నాయి. రూపాయి విలువ దిగజారిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు నుంచి ప్రతి కొనుగోలుకు మరింత ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. నగదు చెల్లింపుల విషయంలో సంక్షోభం తలెత్తితే గతంలో లాగా మళ్లీ బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+