రూ. 24,000 కోట్లు: ఆగస్టు 31వ లోపు డబ్బు తిరిగి చెల్లించండి

Sahara
న్యూఢిల్లీ: మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మూడు కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన రూ. 24,000 కోట్లను తిరిగి చెల్లించనందుకు సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్ప్, సహారా ఇండియా హౌసింగ్ ఇన్వెస్ట్ మెంట్ కార్ప్‌లను సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. తాను ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నడుచుకోకపోతే న్యాయస్దానం హాజరు కావాలని సహారా చీఫ్ సుబ్రతా రాయ్, ఆ సంస్థకు చెందిన రెండు కంపెనీల డెరైక్టర్లు ఆదేశించింది. గతంలో న్యాయస్దానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎందుకు నడుచుకోవడం లేదని సహారా గ్రూప్‌ను ప్రశ్నించింది.

తన ఉత్తర్వుల ప్రకారం సహారాపై చర్యలు తీసుకోకుండా మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ద సెబీని అడ్డుకొన్నందుకు గాను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్)కు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జెఎస్ శేఖర్‌ కూడిన ధర్మాసనం తప్పుబట్టింది. ఆగస్టు 31లోగా సొమ్మును సహారా గ్రూప్ చెల్లించకుంటే కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంది. ఐతే దీనికి సంబంధించిన ఉత్తర్వులను మాత్రం జారీ చేయలేదు. సుబ్రతో రాయ్ వాదనలు వినాలని.. అప్పటివరకూ ఈ మేరకు ఉత్తర్వులను ఇవ్వవద్దని సుబ్రతా రాయ్ న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కేసు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది.

3 కోట్ల మంది మదుపుదారులకు ఇవ్వాల్సిన రూ. 24,000 కోట్లను వారికి తిరిగి చెల్లించడానికి వీలుగా సెబీ వద్ద ఆడబ్బును జమ చేయనందుకు సహారా గ్రూప్‌పై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్బు తిరిగి చెల్లించే వ్యవహారానికి సంబంధించి అలహాబాద్ హైకోర్ట్, శాట్‌ల ముందు పెండింగులో ఉన్న అన్ని పిటిషన్లను తన ముందుకు బదిలీ చేయాలని సైతం ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డబ్బు తిరిగి చెల్లించేందుకు గాను సంబంధించి 2012 ఆగస్టు 31న తాము ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి ఏ హైకోర్టుకానీ, ఎస్‌ఏటీ కానీ ఎటువంటి ఆదేశాలూ ఇవ్వరాదని సైతం సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ విషయంలో ఎస్‌ఏటీ సైతం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. సహారా గ్రూప్ కంపెనీల కేసులో జప్తు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆ గ్రూప్‌కు చెందిన రూ. 52 కోట్ల నగదు, పెట్టుబడులను సెబీ తన ఆధీనంలోకి తీసుకుంది. అంతేకాకుండా 450 ఎకరాల స్దలాన్ని క్రయ విక్రయాలు జరగనివ్వకుండా అడ్డుకుంది. మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ద సెబీ ఆదేశాలకు అనుగుణంగా డిపాజిట్ల రూపంలో ఉన్న రూ. 23 కోట్లను బ్యాంకులు ప్రత్యేకంగా సెబీ ఏర్పాటు చేసిన ఖాతాకు బదిలీ చేశాయి. దీనిపై సెబీ అధికారులు మాట్లాడుతూ మ్యూచవల్ ఫండ్‌లలో పెట్టిన రూ. 28 కోట్ల విలువైన పెట్టుబడులు, డీమ్యాట్ ఖాతాలను స్దంభింప చేసింది.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+