నగదు నిల్వలను వాడండి.. లేదంటే వాడే వారికి ఇవ్వండి: చిదంబరం

P Chidambaram
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్దలు (పీఎస్‌యు) వద్ద ఉన్న భారీ నగదు నిల్వలను ఆ సంస్దలు స్వయంగా పెట్టుబడి పెట్టడం లేదా పెట్టుబడి పెట్టేందుకు మరే ఇతర సంస్దలకైనా ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం సూచించారు. పీఎస్‌యుల వద్ద భారీగా మిగిలిన మిగులు నిధులను అలాగే బ్యాంకుల్లో ఉంచడం వల్ల ఉపయోగం లేకుండా పోతుందని.. అలా కాకుండా వాటిని పెట్టుబడి పెడితే అందరికీ ఉపయోగకరమని అన్నారు. దేశ వ్యాప్తంగా పీఎస్‌యుల వద్ద సుమారు రూ. 2.8 లక్షల కోట్ల మేర మిగులు నిధులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులను ఏ విధంగా ఉపయోగించవచ్చనే అంశంపై తమ వద్ద ఐడియాలున్నాయని.. ఐతే వాటికి ఇంకా తుది రూపం దాల్చలేదని చిదంబరం అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్దలైన ఎన్‌టీపీసీ, ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్, ఎన్‌పీసీఐఎల్ వంటి పీఎస్‌యూల దగ్గర పెద్ద మొత్తంలో నిధులు ఉన్నాయి. పెట్టుబడులకు, వృద్ధికి ఊతమిచ్చే విధంగా ఇటువంటి సంస్థల మిగులు నిధులను ఏ విధంగా ఉపయోగించవచ్చన్న అంశంపై తగు మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఆర్థిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి శక్తికంఠ దాస్ సారథ్యంలో ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ కమిటీ ముసాయిదా నివేదికని ఆర్థిక శాఖకు సమర్పించింది. మ్యూచువల్ ఫండ్స్, టర్మ్ డిపాజిట్లు, ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ బాండ్లు వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చని ఇందులో సూచించింది.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+