
వీటితో పాటు విలీనానికి సంబంధించి రుణదాతలు లేవనెత్తిన అభ్యంతరాలను సైతం తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఆర్.ఎల్.నాగేశ్వరరావు తీర్పునిచ్చారు. విలీనం విషయాన్ని మహీంద్రా సత్యం మంగళవారమే బాంబే స్టాక్ ఎక్సేంజ్ కి తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు ఏప్రిల్ 1, 2011 నుండి విలీనం అమల్లోకి వస్తుంది. విలీన నిష్పత్తిని కూడా గతంలోనే 2:17గా నిర్దారించారు. ఈ విలీన నిష్పత్తి ప్రకారం సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వాటాదార్ల వద్ద ఉన్న ప్రతి 17 షేర్లకు.. కొత్తగా 2 టెక్ మహీంద్రా షేర్లను జారీ చేస్తారు. టెక్ మహీంద్రా కార్యాలయం ముంబైలో ఉన్నందున ఇక నుండి మహీంద్రా సత్యం నమోదిత కార్యాలయం ముంబైకి మారుతుంది.
టెక్మహీంద్రాలో విలీనానికి ఆమోదించాలంటూ మహీంద్రా సత్యం గత ఏడాది జూన్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తరువాత ఈ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ కొందరు రుణదాతలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. విలీనానికి అధికశాతం మంది వాటాదారులు ఆమోదం తెలిపారని, వాటాదారులుగా ఉన్న కొందరు రుణదాతలు మాత్రమే విలీనాన్ని వ్యతిరేకించారని, అందువల్ల అత్యధికశాతం వాటాదారుల నిర్ణయానికే విలువ ఉంటుందని తేల్చి చెప్పారు.
ఈ విలీనం వల్ల రెండు కంపెనీలూ లబ్ది పొందుతాయని, తద్వారా ఈ కంపెనీలతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం కలుగుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విలీనం వల్ల దేశంలో మరో అతి పెద్ద ఐటీ సేవల కంపెనీ ఆవిర్బవించనుంది. దేశంలోని ఐదు అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. రెండు కంపెనీల అదాయాలు, ఉద్యోగుల సంఖ్య పరిగణనలోకి తీసుకుంటే టీసీఎస్, ఇన్పోసిస్, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ తర్వాత మహీంద్రా సత్యం నిలవనుంది. టెక్ మహీంద్రా, మహీంద్రా సత్యం ఉద్యోగుల సంఖ్య 75,000కు పైగా ఉండటంతో రెండు కంపెనీల ఉమ్మడి వార్షిక ఆదాయాలు 2.5 బిలియన్ డాలర్లగా కనిపిస్తున్నాయి. సాంకేతిక అంశాలు పూర్తి అయి ఓకే సంస్థగా ఏర్పడటానికి 2-4 వారాల సమయం పడుతుందని మహీంద్రా సత్యం సీఈవో సీపీ గుర్నానీ వివరించారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications