మహీంద్రా సత్యం - టెక్ మహీంద్రా విలీనానికి హైకోర్టు ఆమోద ముద్ర

Mahindra Satyam and Tech Mahindra
హైదరాబాద్: టెక్ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహీంద్రా సత్యంలో భాగంగా ఉన్న వెంచర్‌బే కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్, సీఅండ్‌ఎస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, కాన్వాస్‌ఎం టెక్నాలజీస్ లిమిటెడ్, మహీంద్రా లాజిసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలకు, టెక్ మహీంద్రా లిమిటెడ్‌కు మధ్య విలీనానికి సంబంధించి జరిగిన ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆమోద ముద్ర వేసింది. ప్రజా ప్రయోజనాలు, వాటాదారులు, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోని ఈ విలీనానికి ఆమోదం తెలుపుతున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. పైన పేర్కొన్న కంపెనీల మధ్య జరిగిన విలీనం విచారణకు ఏ విధమైన ఆటంకం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ విలీనాన్ని సవాలు చేస్తూ రుణదాతలు, వాటాదారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

వీటితో పాటు విలీనానికి సంబంధించి రుణదాతలు లేవనెత్తిన అభ్యంతరాలను సైతం తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఆర్.ఎల్.నాగేశ్వరరావు తీర్పునిచ్చారు. విలీనం విషయాన్ని మహీంద్రా సత్యం మంగళవారమే బాంబే స్టాక్ ఎక్సేంజ్ కి తెలిపింది. ముందుగా నిర్ణయించినట్లు ఏప్రిల్ 1, 2011 నుండి విలీనం అమల్లోకి వస్తుంది. విలీన నిష్పత్తిని కూడా గతంలోనే 2:17గా నిర్దారించారు. ఈ విలీన నిష్పత్తి ప్రకారం సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వాటాదార్ల వద్ద ఉన్న ప్రతి 17 షేర్లకు.. కొత్తగా 2 టెక్ మహీంద్రా షేర్లను జారీ చేస్తారు. టెక్ మహీంద్రా కార్యాలయం ముంబైలో ఉన్నందున ఇక నుండి మహీంద్రా సత్యం నమోదిత కార్యాలయం ముంబైకి మారుతుంది.

టెక్‌మహీంద్రాలో విలీనానికి ఆమోదించాలంటూ మహీంద్రా సత్యం గత ఏడాది జూన్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తరువాత ఈ విలీన ప్రక్రియను వ్యతిరేకిస్తూ కొందరు రుణదాతలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై సుదీర్ఘ వాదనలు విని తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. విలీనానికి అధికశాతం మంది వాటాదారులు ఆమోదం తెలిపారని, వాటాదారులుగా ఉన్న కొందరు రుణదాతలు మాత్రమే విలీనాన్ని వ్యతిరేకించారని, అందువల్ల అత్యధికశాతం వాటాదారుల నిర్ణయానికే విలువ ఉంటుందని తేల్చి చెప్పారు.

ఈ విలీనం వల్ల రెండు కంపెనీలూ లబ్ది పొందుతాయని, తద్వారా ఈ కంపెనీలతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం కలుగుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విలీనం వల్ల దేశంలో మరో అతి పెద్ద ఐటీ సేవల కంపెనీ ఆవిర్బవించనుంది. దేశంలోని ఐదు అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. రెండు కంపెనీల అదాయాలు, ఉద్యోగుల సంఖ్య పరిగణనలోకి తీసుకుంటే టీసీఎస్, ఇన్పోసిస్, విప్రో, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ తర్వాత మహీంద్రా సత్యం నిలవనుంది. టెక్ మహీంద్రా, మహీంద్రా సత్యం ఉద్యోగుల సంఖ్య 75,000కు పైగా ఉండటంతో రెండు కంపెనీల ఉమ్మడి వార్షిక ఆదాయాలు 2.5 బిలియన్ డాలర్లగా కనిపిస్తున్నాయి. సాంకేతిక అంశాలు పూర్తి అయి ఓకే సంస్థగా ఏర్పడటానికి 2-4 వారాల సమయం పడుతుందని మహీంద్రా సత్యం సీఈవో సీపీ గుర్నానీ వివరించారు.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+