కోర్టు బయట సెటిల్‌మెంట్ ఆలోచనలో యస్ బ్యాంక్ కో ఫౌండర్ భార్య

Yes Bank
ముంబై: యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ మరియు కో ఫౌండర్ అశోక్ కపూర్ భార్య మధు కపూర్ మధ్య వివాదాన్ని కోర్టు బయట సెటిల్‌మెంట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. బిజినెస్ స్టాండర్ట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో మధు కపూర్ సన్నిహితుడు ఒకరు ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ సంధర్బంలో మాట్లాడుతూ ఇది చాలా బాగుంది. ఇలాంటి సన్నివేశం ఎవరికీ రాకూడదు. ఈ వివాదంలో కోర్టు బయట సెటిల్‌మెంట్ ఓ మంచి నిర్ణయమని అన్నారు. అసలు వీరిద్దరి మధ్య వివాదానికి గల కారణాలను గమనిస్తే...

ముంబై టెర్రరిస్టుల దాడుల్లో మరణించిన యస్ బ్యాంక్ సహవ్యవస్థాపకుడు అశోక్ కపూర్‌కు భార్య అయిన మధు కపూర్‌కు బ్యాంకులో 12 శాతం వాటా ఉంది. యస్ బ్యాంక్ సీఈఓ సీఈవో రాణా కపూర్ ముగ్గురు రవీష్ చోప్రా, ఎంఆర్ శ్రీనివాసన్‌లతోపాటు దివాన్ అరుణ్ నందాను డెరైక్టర్లుగా ఎంపిక చేశారు. రాణా కపూర్ ప్రతిపాదించిన ఈ ముగ్గురు డెరైక్టర్ల నియామకాలను వ్యతిరేకిస్తూ మధు కపూర్ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనితో పాటు బోర్డులో తమ కుమార్తె షగున్ గోగియాకు స్థానాన్ని కల్పించేందుకు వీలుగా నామినేషన్‌ను దాఖలు చేసుకోమంటూ మధు కపూర్‌కు జస్టిస్ ఎస్‌జే కాఠావాలా సూచించారు. బోర్డు సమావేశంలో షగున్‌ను డెరైక్టర్‌గా ఎంపిక చేసే అంశాన్ని చేపట్టవలసిందిగా కూడా బ్యాంకుకు కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 1న కోర్టు చేపట్టనుంది.

ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌కు యస్ బ్యాంకులో 13.72% వాటా ఉంది. ఈ తీర్పుతో నెల రోజుల ముందుగానే బోర్డు సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా ప్రైవేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌ను ముంబై హైకోర్టు ఆదేశించింది. నిజానికి జూలై 24న యస్ బోర్డును సమావేశం జరుగుతుందని బ్యాంకు నిర్ణయం తీసుకున్నప్పటికీ ముంబై కోర్టు తాజా ఆదేశాలతో ఈ నెల 27న సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+