రాజధానిలో రూ. 28,000 మార్కును చేరుకున్న బంగారం

Glod
న్యూఢిల్లీ: గత కొన్ని వారాలుగా పసిడి ధర బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఐతే మళ్లీ బులియన్ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో కళకళలాడటంతో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. నిన్న రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర మరోసారి రూ. 28,000 మార్కును చేరుకుంది. ఇక ఆభరణాల కోసం వినియోగించే పసిడి ధర రూ. 27,800 వద్ద ముగిసింది.

(A comparison of the cheapest home loan rates in India)

బంగారంతో పాటు వెండి ధర కూడా కిలోకి రూ. 500 పెరిగి రూ. 45,500 వద్ద ముగిసింది. ఇటీవల కాలంలో చూసినట్లైతే ఏప్రిల్ 15 తర్వాత పసిడి ధర మళ్లీ గరిష్ట స్దాయికి చేరుకుందని నిపుణులు తెలిపారు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులతో పాటు, పెళ్లిళ్ల సీజన్ రావడంతో స్టాకిస్టులు, ట్రేడర్లు, వినియోగదారులు భారీగా బంగారం కొనుగోళ్లు జరపడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు:

లండన్ కమోడిటీస్ మార్కెట్లో పుత్తడి ధర ఔన్సుకు (31.1 గ్రాములు) 1.1 శాతం పెరిగి 1,448.28 వద్ద ట్రేడయ్యింది. ఏప్రిల్ 15న పసిడి రేటు 9.1 శాతం వరకూ పతనమైంది. గత పన్నెండు సంవత్సరాల నుండి పెరుగుతూ పోయిన బంగారం ఈ ఏడాది ఇప్పటిదాకా 14 శాతం మేర తగ్గింది.

ఏప్రిల్ 16న రెండేళ్ల కనిష్టమైన 1,321.95 డాలర్లకు పడిపోయింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి(ఏప్రిల్ 25వ తారీఖు)న ధరలు:

ముంబై: 10 గ్రాముల బంగారం ధర రూ. 26.710
ఢిల్లీ: 10 బంగారం ధర రూ. 27.080
చెన్నై: 10 బంగారం ధర రూ. 27.050
కోలకతా: 10 బంగారం ధర రూ. 27.050
బెంగుళూర్: 10 బంగారం ధర రూ. 27.091
హైదరాబాద్: 10 బంగారం ధర రూ. 27.035

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+