సహారా గ్రూప్, సుబ్రతో రాయ్ కోర్టులను మోసం చేస్తున్నారు: సుప్రీం కోర్టు

Subrata Roy
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతోరాయ్‌ని భారత అత్యున్నత న్యాయస్దానం సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఇన్వెస్టర్ల నుండి సహారా గ్రూప్ సంస్దలు రెండు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్-ఎస్‌ఐఆర్‌ఈసీ, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్- ఎస్‌హెచ్‌ఐసీ) రూ. 24,000 కోట్ల చెల్లింపులకు సంబంధించి అనవసరమైన విధానాలతో కోర్టులను ఆశ్రయిస్తూ న్యాయస్దానాలను మోసగిస్తున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఇన్వెస్టర్ల వద్ద నుండి సమీకరించిన రూ.24,000 కోట్లు డిపాజిట్ చేయడంలో విఫలమయితే గ్రూప్ కంపెనీల ఆస్తుల జప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ‘రిలీఫ్'లు కోరుతూ అలహాబాద్ హైకోర్టును సహారా ఇండియా ఆశ్రయించిందని సుప్రీంకోర్టుకు మార్కెట్ రెగ్యులేటరీ సంస్ద అయిన సెబీ తెలియజేసింది. దీంతో సుబ్రతారాయ్‌పై కోర్టు తీవ్ర అసహానం వ్యక్తం చేస్తూ మీరు కోర్టులను మోసం చేస్తున్నారని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ ఖేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇన్వెస్టర్లకు చెల్లింపులపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై అసలు స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంత మంది ఇన్వెస్టర్లకు సొమ్ముని తిరిగి చెల్లించేందుకు సిద్దమైనప్పటికీ.. జాడ లేని ఇన్వెస్టర్ల సొమ్మును కేంద్ర ప్రభుత్వానికి జమచేయాలని మార్కెట్ రేగ్యులేటరీ సంస్ద (సెబీ)కి సుప్రీం కోర్టు సూచించింది.

సహారా గ్రూపు సంస్థల్లో పెట్టుబడి పెట్టిన మూడుకోట్ల మంది ఇన్వెస్టర్లలో కొందరి చిరునామాలు తెలియడం లేదన్న వార్తలు సైతం సోమవారం వాదనల్లో ప్రస్తావనకు వచ్చాయి. అటువంటి ఇన్వెస్టర్ల సొమ్మును కేంద్రం వద్ద జమచేసే హాక్కు సెబీకి ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న మొత్తం రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో మూడు నెలల్లో చెల్లించాలని ఆగస్టు 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆగస్టు 31వ తేదీన తాను ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సహారా ఇండియాకు చెందిన సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ (సైరెక్‌), సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ (షిక్‌) ఆస్తులను అటాచ్‌ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనందుకు సెబీని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

సహారా గ్రూప్‌ ఖాతాలను నిలిపివేసే అధికారం సెబీకి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుండి రూ. 24,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కేసులో సహారా గ్రూప్‌లోని రెండు కంపెనీలు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీ)ల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ఆస్తులతోపాటు, 100 బ్యాంక్ ఖాతాలను కూడా జప్తు చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్‌కు చెందిన షేర్లు, ఆస్తులను కూడా వెంటనే జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇక సుబ్రతో రాయ్, మరో ఇరువురు డెరైక్టర్లు- అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబేల అరెస్టును కోరుతూ సెబీ దాఖలు చేసిన పిటిషన్‌పై నోటీసులను సైతం సుప్రీంకోర్టు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకుండా ఆదేశాలు జారీచేయడానికి ప్రస్తుతానికి నిరాకరించిన కోర్టు ఈ మొత్తం వ్యవహారంలో తమ స్పందనను తెలియజేయడానికి ప్రమోటర్, రెండు గ్రూప్ సంస్థలకు వారం సమయాన్ని మంజూరు చేసింది. అలహాబాద్ హైకోర్టును సహారా ఇండియా ఆశ్రయించడానికి గల కారణాలను సుబ్రతో రాయ్ తరుపు న్యాయవాది వివరించే ప్రయత్నం చేశారు. మీరు హైకోర్టుకు వెళ్లినట్లయితే, అది ఈ కోర్టు ధిక్కరణ కిందే పరిగణించడం జరుగుతుంది. నిధుల చెల్లింపులకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఇందుకు సమయాన్ని పెంచాలని సెబీని కోరడం కరెక్టు కాదు. మీరు అప్పీల్ మీద అప్పీల్ ఎలా చేస్తారు? తప్పులమీద తప్పు చేసే బదులు మీరు మీ తప్పులను సరిదిద్దుకోవాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+