గంట పాటు ప్రశ్నించారు.. కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదు: సుబ్రతో రాయ్

Sahara chief Subrata Roy appears before Sebi
ముంబై: సహారా గ్రూప్ ఇన్వెస్టర్లకు రూ.24 వేల కోట్లకుపైగా డిపాజిట్ల రిఫండ్ కేసులో సుబ్రతో రాయ్ మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్థ సెబీ బుధవారం నాడు హాజరయ్యారు. తన ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని సుబ్రతో రాయ్‌తో పాటు అశోక్‌ రారు చౌదరి, రవి శంకర్‌ దుబే (వీరు సహారా గ్రూప్‌లోని రెండు సంస్థల డైరెక్టర్లు) వందనా భార్గవలతోపాటు హోల్‌టైమ్‌ సభ్యుడు ప్రశాంత్‌ శరణ్‌కు సెబీ గత నెల 26న సమన్లు పంపిన విషయం తెలిసిందే. రాయ్‌తో పాటు ఈ ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను సెబీ ప్రశ్నించింది. సుమారు మూడు కోట్ల మంది పెట్టుబడిదారుల నుంచి సహారా గ్రూప్ డిపాజిట్లు వసూలు చేసి వారికి ఇవ్వాల్సిన 24 వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించనందుకు కేసు దాఖలైంది. కేసుకు సంబంధించి వాళ్ల వ్యక్తిగత ఆస్తులు, ఇతరత్రా పెట్టుబడులపై ప్రశ్నించింది. సుమారు గంటకు పైగా ఈ విచారణ జరిగినట్లు సమాచారం. డిపాజిట్లను సమీకరించిన సహారా గ్రూప్ కంపెనీల పెట్టుబడుల వివరాలను కూడా సెబీ అధికారులు సేకరించారు.

సెబీ విచారణ తర్వాత రాయ్ విలేకరులతో మాట్లాడుతూ తన వ్యక్తిగత ఆస్తుల గురించే సెబీ ప్రశ్నించిందని అన్నారు. నా ఆస్తుల వివరాలను చూస్తే బంగారు ఆభరణాలు ఇతరత్రా కలిపి వ్యక్తిగతంగా నా ఆస్తి మొత్తం రూ 3 కోట్లు. ఇందులో రూ 34 లక్షల నగదు, బ్యాంక్ బ్యాలెన్స్, రూ 1.59 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. చక్కెర మిల్లుల కొనుగోలు కోసం రూ.11 కోట్ల రుణం తీసుకున్నాను. ఇక స్థిరాస్తులు అంటూ ఏమీ లేవని రాయ్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన బకాయి సొమ్ము సెబి వద్దనే ఉందన్నారు. ఇన్వెస్టర్ల డబ్బు వీలైనంత త్వరగా వారి డబ్బు వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాయ్‌ అన్నారు. సెబి గత నాలుగు నెలల నుంచి ఇన్వెస్టర్ల వివ రాలను పూర్తిస్థాయిలో తెలుసుకుని ఉండాల్సిందని ఆయన అన్నారు.

చాలా మంది ఇన్వెస్టర్లకు సొమ్మును తిరిగి చెల్లించేశామని, ఇంకా చెల్లించాల్సిన రూ. 5,120 కోట్ల నగదు సెబీ వద్దే ఉందని సుబ్రతో రాయ్ పేర్కొన్నారు. తనిఖీ ప్రక్రియ ప్రారంభానికి ముందే తాము సమర్పించిన ఖాతాలన్నీలొసుగులు ఉన్నాయని సెబీ ఆరోపించడం హాస్యాస్పదం అన్నారు. గంటపాటు ప్రశ్నించిన సెబీ... తమకు కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని వాపోయారు.

నిన్న జరిగిన సమావేశంలో వ్యక్తిగత ఆస్తులు, కంపెనీ పెట్టుబడులు... ఎక్కడెక్కడ ఆస్తులుకొనుగోలు చేసింది తదితర వివరాలు సెబి అడిగి తెలుసుకుంది. డిపాజిటర్లకు ఈ స్థిరాస్తులు విక్రయించి డబ్బు చెల్లించేందుకు వివరాలు అడిగి తెలుసుకుంది. సహారాకు చెందిన రెండు కంపెనీలు సహారా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐఆర్‌ఈసీఎల్‌), సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌ఐసీఎల్‌) పేరుపై కొనుగోలు చేసిన స్థిరాస్తుల టైటిల్‌ డీడ్స్‌ (ఒరిజినల్‌) తమ ముందు ప్రవేశ పెట్టాలని నలుగురు డైరెక్టర్లను ఆదేశించింది.

కేసు పూర్తి వివరాలు:

బాండ్‌ల జారీ ద్వారా దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్‌నకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ రూ.6,380 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ రూ.19,400 కోట్లను సమీకరించాయి. ఈ నిధుల సమీకరణలో ఈ రెండు కంపెనీలు పలు అవకతవకలను పాల్పడ్డాయనేది సెబీ ఆరోపణ. ఈ కేసులో సుప్రీం కోర్టు గతేడాది ఆగస్టులో ఈ రూ.24,000 కోట్లకు పైగా మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా సహారా గ్రూప్ కంపెనీలను ఆదేశించింది.

నిబంధనలకు విరుద్దంగా ఇన్వెస్టర్ల నుండి రూ. 24,000 కోట్లకు పైగా నిధులు సమీకరించిన కేసులో సహారా గ్రూప్‌లోని రెండు కంపెనీలు (సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీ), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీ)ల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల ఆస్తులతోపాటు, 100 బ్యాంక్ ఖాతాలను కూడా జప్తు చేస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్‌కు చెందిన షేర్లు, ఆస్తులను కూడా వెంటనే జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసు విషయంలో ఈ నెల 6న సుప్రీం కోర్టు జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో మార్కెట్ రెగ్యులేటర్ సంస్ద (సెబీ)చర్యలు తీసుకుంది.

జప్తునకు ఆదేశించిన ఆస్తులలో గ్రూప్‌నకు చెందిన పుణేలోని ఆంబీ వ్యాలీ రిసార్ట్ టౌన్‌తోసహా ఢిల్లీ, ముంబైలలోగల ఇతర రియల్టీ ఆస్తులు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 6వ తారీఖున సుబ్రోతో రాయ్‌కు చెందిన సహారా గ్రూపుకి చెందిన రెండు కంపెనీల ఆస్తుల జప్తుకు మార్కెట్ రెగ్యులేటర్ సంస్ద అయిన సెబీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించినందుకు సహారాకు చెందిన రెండు కంపెనీల ఖాతాలతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు కల్పించింది. దీంతో ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లను చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన గ్రూప్ రెండు కంపెనీల అకౌంట్లను స్తంభింపజేసి, ఆస్తులను జప్తు చేసే సంపూర్ణ అధికారాలు సెబీకి లభించాయి.

కాగా, రాయ్ అరెస్టుకు అనుమతితో పాటు, దేశం విడిచిపోకుండా ఆదేశించాలంటూ సెబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు ఈ నెలలోనే విచారించనుంది. డిపాజిట్ల చెల్లించాల్సిన కేసుకు సంబంధించి సహారా గ్రూప్ ఇన్వెస్టర్లను బెదిరిస్తోందన్న ఆరోపణలపై పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదు విషయంలో సహారా గ్రూపుపై ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టినట్లు ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+