
ప్రస్తుతం మా వద్ద ఉన్న ఈ నిధులతో విమానాల పనులు నిర్వహించడానికి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి సరిపోతాయని పేర్కొన్నారు. ఎలాగైనా సరే ఎయిర్లైన్స్ పునః ప్రారంభించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్లు సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. కింగ్ఫిషర్ సమర్పించిన ఈ ప్రణాళికపై డీజీసీఏ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్ఫిషర్కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్గ్రూప్లో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పీఎన్బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఇటీవల రుణ సంక్షోభంలో చిక్కుకుపోయి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడగా.. ఇప్పుడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు అప్పులిచ్చిన బ్యాంకులు యూనైటెడ్ స్పిరిట్ షేర్లను అమ్ముకోవచ్చంటూ ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కోసం బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి గాను మాల్యా యూబీ గ్రూపునకు చెందిన యూనైటెడ్ స్పిరిట్ షేర్లు స్టేట్ బ్యాంకు వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్నారు.
రుణం తీసుకున్న డబ్బుని విజయ్ మాల్యా చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను ఒపెన్ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్ల షేర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. దీంతో విజయ్ మాల్యా ముంబై హైకోర్టును ఆశ్రయించి తక్షణమే తనఖా పెట్టిన షేర్లను విక్రయించరాదని ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ కింగ్ఫిషర్ మాతృ సంస్థ విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను జస్టిస్ ఎస్జే కట్టావాలా తిరస్కరించారు. యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్తోపాటు, రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియం తమ వాదనలను బొంబాయి హైకోర్టుకి వినిపించాయి. రుణాల చెల్లింపులో కింగ్ఫిషర్ విఫలంకావడంతో ఇప్పటికే తాము తనఖాలో ఉన్న షేర్ల విక్రయాన్ని మొదలుపెట్టినట్లు వాదనలో భాగంగా బ్యాంకులు హైకోర్టుకి తెలిపాయి. దీంతో కింగ్ఫిషర్కు రుణాలిచ్చిన బ్యాంకులు సెక్యూరిటీగా తమ తనఖాలో ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునంటూ ముంబై హైకోర్టు స్పష్టం చేసింది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications