రూ. 650 కోట్ల నిధులతో ప్రణాళిక: తొలుతగా ఏడు విమాన సర్వీసులు

Kingfisher Airlines submits revival plan to regulator, seeks nod to fly again
న్యూఢిల్లీ: విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమాన సేవల పునరుద్దరణం ప్రణాళికను ఏవియేషన్ రెగ్యులేటర్ - డీజీసీఏ (డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు సమర్పించింది. ఇటీవల రద్దు చేసిన లైసెన్సు‌ని కూడా పునరుద్ధరణ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సీఈఓ సంజయ్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దీనికి ముందు సంజయ్ అగర్వాల్ డీజీసీఏ చీఫ్ అరుణ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా యునెటైడ్ బ్రూవరీస్ గ్రూప్ నుండి వచ్చే రూ. 650 కోట్లతో మొదట ఏడు విమాన సర్వీసులను ప్రారంభించాలనేది తమ ప్రణాళికలో భాగమని సంజయ్ అగర్వాల్ తెలిపారు.

ప్రస్తుతం మా వద్ద ఉన్న ఈ నిధులతో విమానాల పనులు నిర్వహించడానికి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి సరిపోతాయని పేర్కొన్నారు. ఎలాగైనా సరే ఎయిర్‌లైన్స్ పునః ప్రారంభించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్లు సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్ సమర్పించిన ఈ ప్రణాళికపై డీజీసీఏ త్వరలో ఓ నిర్ణయం తీసుకోనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం రూ. 7000 కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 1న కంపెనీ ప్లయింగ్ లెసైన్స్‌ను కేంద్రం సస్పెండ్ చేయగా.. డిసెంబర్ 31తో లెసైన్స్ గడువు కూడా ముగిసింది. రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలను వసూలు చేసేందుకు గాను నాలుగు ప్రధాన బ్యాంకులు కలిసి ఒక సబ్ గ్రూప్‌గా ఏర్పడ్డాయి. గతంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో 17 బ్యాంకులు కింగ్‌ఫిషర్‌కు రూ.7,500 కోట్ల పైగా రుణాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కంపెనీకి రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియంలో భాగస్వామ్యులైన కీలక బ్యాంకుల నుంచి ఈ సబ్‌గ్రూప్ ఏర్పాటైంది. ఈ సబ్‌గ్రూప్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పీఎన్‌బీ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే ఇటీవల రుణ సంక్షోభంలో చిక్కుకుపోయి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడగా.. ఇప్పుడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు అప్పులిచ్చిన బ్యాంకులు యూనైటెడ్ స్పిరిట్ షేర్లను అమ్ముకోవచ్చంటూ ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే... లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కోసం బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి గాను మాల్యా యూబీ గ్రూపునకు చెందిన యూనైటెడ్ స్పిరిట్ షేర్లు స్టేట్ బ్యాంకు వద్ద తనఖా పెట్టి రుణం తీసుకున్నారు.

రుణం తీసుకున్న డబ్బుని విజయ్ మాల్యా చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను ఒపెన్ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్ల షేర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. దీంతో విజయ్ మాల్యా ముంబై హైకోర్టును ఆశ్రయించి తక్షణమే తనఖా పెట్టిన షేర్లను విక్రయించరాదని ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ కింగ్‌ఫిషర్ మాతృ సంస్థ విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌జే కట్టావాలా తిరస్కరించారు. యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌తోపాటు, రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియం తమ వాదనలను బొంబాయి హైకోర్టుకి వినిపించాయి. రుణాల చెల్లింపులో కింగ్‌ఫిషర్ విఫలంకావడంతో ఇప్పటికే తాము తనఖాలో ఉన్న షేర్ల విక్రయాన్ని మొదలుపెట్టినట్లు వాదనలో భాగంగా బ్యాంకులు హైకోర్టుకి తెలిపాయి. దీంతో కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు సెక్యూరిటీగా తమ తనఖాలో ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునంటూ ముంబై హైకోర్టు స్పష్టం చేసింది.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+