ఐటీయేతర బిజినెస్ విడదీసి 'విప్రో ఎంటర్ ప్రైజెస్' పేరుతో కొత్త కంపెనీ

Wipro
ముంబై: గత ఏడాది నవంబర్లో ప్రకటించిన దాని ప్రకారం విప్రో ఐటీయేతర బిజినెస్‌లను 'విప్రో ఎంటర్ ప్రైజెస్' పేరుతో కొత్త కంపెనీగా విడదీసింది. ఈ కంపెనీలో విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్, మెడికల్ డయాగ్నోస్టిక్ ప్రొడక్ట్‌లు, సర్వీసుల బిజినెస్‌లు ఉండనున్నాయి. మార్చి 31 నుండి ఇది అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా 'విప్రో ఎంటర్ ప్రైజెస్' కు సంబంధించి షేర్లను వాటాదార్లకు కేటాయించేందుకు ఈ నెల 11ను రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్లో విప్రో షేరు ధర 12 శాతం పడిపోయింది. ఐటీయేతర బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీగా విడదీసిన నేపథ్యంలో విప్రో షేరు ఆమేరకు విలువలో రూ. 55 (12%) కోల్పోయి రూ. 394 వద్ద ముగిసింది.

ఇక కంపెనీ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ. 11,882 కోట్లు తగ్గి రూ. 98,551 కోట్లకు పరిమితమైంది. కాగా ఇకపై విప్రో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తుంటే , విప్రో ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ మార్కెట్లో అన్‌లిస్టెడ్ కంపెనీగా కొనసాగనుంది. ఇన్పోసిస్ కూడా శుక్రవారం తన ఫలితాలను ప్రకటించనుంది.

కంపెనీని రెండుగా విడదీయడం వల్ల లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని విప్రో సీఎఫ్‌వో సురేష్ సేనాపతి అన్నారు. మొత్తంగా విప్రో మార్జిన్లతో పోలిస్తే ఐటీ బిజినెస్ లాభం గరిష్ట స్థాయిలో ఉంటుందని తెలిపారు. విభజన నేపథ్యంలో యాజమాన్య నిర్వహణలో మార్పులు ఉండవని సేనాపతి చెప్పారు. విప్రో బోర్డు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అజీం ప్రేమ్‌జీ విప్రోకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గానే బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. అయితే విప్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. మొత్తం ఆదాయంలో 90% వాటాను ఆక్రమిస్తున్న ఐటీ సేవలపై మరింత దృష్టిపెట్టేందుకే వ్యాపార విభజనను చేపడుతున్నట్లు చెప్పారు.

100 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ పరిశ్రమలో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం, యాక్సెంచర్ వంటి దిగ్గజాలతో పోటీపడుతున్నామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా భవిష్యత్‌లో ఐటీ సేవలపై మరింత దృష్టిని కేంద్రీకరించనున్నట్లు చెప్పారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం 2013 మే నెల కల్లా లిస్టెడ్ కంపెనీలో ప్రమోటర్ల వాటా 75%కు మించరాదు. ప్రస్తుతం విప్రోలో ప్రమోటర్ల వాటా 78.3%గా ఉంది. విప్రో ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు తరువాత ఈ వాటా 75.7%కు దిగి వస్తుందని చెబుతున్నారు.

ఈ పునర్‌వ్యవస్దీకరణ పధకంలో భాగంగా దేశీయ వాటాదారులకు మూడు ఐచ్చికాలు ఉండోచ్చు. వాటాదారుల వద్ద ఉన్న రూ. 2 ముఖ విలువ కలిగిన ప్రతి ఐదు విప్రో షేర్లకు రూ.10 ముఖ విలువ కలిగిన ఒక విప్రో ఎంటర్‌ప్రైజెస్ షేరు లభిస్తుంది. రెండో ఐచ్చికంలో విప్రో వాటాదారులు వారి వద్ద ఉన్న ప్రతి 5 షేర్లకు రూ.50 ముఖ విలువ కలిగిన ఒక రిడీముబల్ ప్రిఫరెన్స్ షేరు పొందవచ్చు. మూడో ఆఫ్షన్లో విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో లభించే షేర్లకు బదులు ప్రమోటర్ల నుండి విప్రో షేర్లనే పొందవచ్చు. విప్రో లైటింగ్ ఉత్పత్తులతోపాటు సంతూర్, షికాకాయ్, చంద్రిక, బేబీ సాఫ్ట్, సన్‌ఫ్లవర్ వనస్పతి, గ్లూకోవిటా, యార్డ్‌లీ బ్రాండ్లు విప్రో ఎంటర్‌ప్రైజెస్లలో ఉన్నాయి.

వన్ఇండియా మనీ తెలుగు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+