విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ షేర్లను విక్రయిస్తున్నాం: ఎస్‌బీఐ

Kingfisher lenders to continue selling USL shares: SBI
ముంబై: తీసుకున్న రుణానికి గాను సెక్యూరిటీగా కింగ్‌ఫిషర్ తనఖా పెట్టిన యునైటెడ్‌ స్పిరిట్స్‌ (యుఎస్‌ఎల్‌)ను విక్రయించడం కొనసాగుతుందని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మిడ్‌ కార్పోరేట్స్‌ డిఫ్యూటీ ఇన్‌చార్జ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్యామల్‌ ఆచార్య తెలిపారు. కింగ్‌ఫిషర్‌కి అప్పులిచ్చిన 17 బ్యాంకుల కన్సార్టియంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ వాటాను కలిగి ఉన్న విషయం తెలిసిందే. తనఖాగా ఉంచిన 26 లక్షల షేర్లలో ఇప్పటికే 7.3 లక్షల షేర్లను విక్రయించినట్లు తెలిపారు. షేరుకి రూ. 1,840 సగటు ధరలో వీటిని విక్రయించినట్లు తెలుస్తోంది. విజయ్ మాల్యా, యుఎస్‌ఎల్‌లకు చెందిన 97 శాతం వాటాలు వివిధ బ్యాంకుల వద్ద తనఖా పెట్టడం జరిగింది. వీటి ప్రస్తుత మార్కెట్‌ విలువ దాదాపు రూ. 6,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు అన్ని బ్యాంకుల వద్ద కలిపి మొత్తం రూ. 7,500 కోట్ల పైగా అప్పులున్నాయి.

అంతక ముందు రుణం తీసుకున్న డబ్బుని విజయ్ మాల్యా చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను ఒపెన్ మార్కెట్లో సుమారు రూ. 100 కోట్ల షేర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించింది. దీంతో విజయ్ మాల్యా ముంబై హైకోర్టును ఆశ్రయించి తక్షణమే తనఖా పెట్టిన షేర్లను విక్రయించరాదని ఆదేశించాలని కోర్టును కోరారు. ఇందుకు అభ్యంతరం చెబుతూ కింగ్‌ఫిషర్ మాతృ సంస్థ విజయ్ మాల్యాకు చెందిన యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను జస్టిస్ ఎస్‌జే కట్టావాలా తిరస్కరించారు.

యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌తోపాటు, రుణాలిచ్చిన 17 బ్యాంకుల కన్సార్షియం తమ వాదనలను బొంబాయి హైకోర్టుకి వినిపించాయి. రుణాల చెల్లింపులో కింగ్‌ఫిషర్ విఫలంకావడంతో ఇప్పటికే తాము తనఖాలో ఉన్న షేర్ల విక్రయాన్ని మొదలుపెట్టినట్లు వాదనలో భాగంగా బ్యాంకులు హైకోర్టుకి తెలిపాయి. దీంతో కింగ్‌ఫిషర్‌కు రుణాలిచ్చిన బ్యాంకులు సెక్యూరిటీగా తమ తనఖాలో ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునంటూ ముంబై హైకోర్టు స్పష్టం చేసింది.

అత్యధికంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1,800 కోట్ల వరకు రుణాలు ఇచ్చింది. 2012 జనవరి నుంచి రూ. 7,500 కోట్లమేర బకాయిలను కింగ్‌ఫిషర్ చెల్లించకపోవడంతో యూఎస్‌ఎల్ షేర్లను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించాయి. దీనిలో భాగంగానే సెక్యూరిటీగా తనఖా పెట్టిన యూఎస్‌ఎల్, మంగళూర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ షేర్లతోపాటు, గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాకు చెందిన గోవా విల్లా, ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌లను విక్రయించేందుకు సిద్దమయ్యాయి.

వన్ఇండియా మనీ తెలుగు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+