2జీ కేసులో ఎయిర్‌టెల్, ఎస్సార్ గ్రూప్ ఛైర్మన్లకు సీబీఐ కోర్టు సమన్లు

Sunil Bharti Mittal-Ravi Ruia
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కేసులో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్‌తో పాటు మరో ఏడుగురికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 11న విచారణకు హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశించింది. సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసిన వారిలో హచిసన్ మ్యాక్స్ టెలికం (ప్రస్తుత వోడాఫోన్ ఇండియా) మాజీ మేనేజింగ్ డైరెకట్ర్ ఆసిమ్ ఘోష్, టెలికం శాఖ మాజీ కార్యదర్శి శ్యామల్ ఘోష్ లతో పాటు ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్ రవి రూయా ఉన్నారు.

పైన పేర్కొన్న కంపెనీలకు వ్యతిరేకంగా దాఖలైన చార్జిషీటులోని అంశాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు తాజా సమన్లు జారీ చేసింది. ఆయా కంపెనీలకు మిట్టల్, రుయా, ఘోష్‌లు చీఫ్‌లుగా ఉన్నందున వారి ఆలోచనా సరళికి తగ్గట్లుగానే వాటి పనితీరు ఉంటుందని స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైనీ అభిప్రాయపడ్డారు. వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాకు రూ. 846 కోట్ల మేర ఆదాయానికి గండికొట్టారంటూ శ్యామల్ ఘోష్, మరో మూడు టెలికం కంపెనీలపై గతేడాది డిసెంబర్ 21న దాఖలు చేసిన 57 పేజీల చార్జి షీటులో సీబీఐ ఆరోపించింది.

ఎన్డీయే హయాంలో 2002లో భారతీ సెల్యులార్ (ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్), స్టెర్లింగ్ సెల్యులార్ (వొడాఫోన్ మొబైల్ సర్వీస్)కు ఢిల్లీ మెట్రో ఏరియాలోను, హచిసన్ మ్యాక్స్‌కు ముంబైలో స్పెక్ట్రం కేటాయింపులు జరిగాయని వివరించింది. బీజేపీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ అప్పట్లో టెలికం మంత్రిగా వ్యవహరించారు. ఇది ఇలా ఉంటే సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై సవాల్ చేస్తామని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. సీబీఐ కావాలని తమ ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కంపెనీ తరుపు న్యాయవాదులు పేర్కొన్నారు.

ఇక భారతీఎయిర్‌టెల్‌ ప్రమోటర్లు 2007-08లో టెకోవర్‌ నిబంధలను ఉల్లంఘించలేదని మార్కెట్‌ రెగ్యులేటర్ సంస్థ సెబీ పేర్కొందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. భారతి ఎయిర్‌టెల్‌ టేకోవర్‌ నిబంధ నలను అతిక్రమించిందని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో సెబీ విచారణ చేపట్టింది. విచారణలో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేలిందని ఆర్థికశాఖ సహాయ మంత్రి నమో నారాయణ మీనా ఒక ప్రశ్నకు రాజ్యసభలో లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చారు. విచారణలో భాగంగా పలు వురు లేవనెత్తిన అంశాలను పరిశీలించిన తర్వాత ఎయిర్‌టెల్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని తేలిందని మంత్రి చెప్పారు. నవంబర్‌ 2012లో ఈ కేసును మూసివేయడం జరిగిందని మీనా చెప్పారు.

వన్ఇండియా తెలుగు మనీ

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+