ఎయిర్ ఏషియా - టాటా జేవి కంపెనీకి సీఈఓగా చెన్నై స్మార్ట్ బాయ్

AirAsia
చెన్నై: భారతదేశంలో త్వరలో తాము ప్రారంభించబోయే కంపెనీకి సీఈఓగా చెన్నైకి చెందిన ఒక స్మార్ట్ బాయ్‌ని ఎంపిక చేసుకున్నట్లు ఎయిర్ ఏషియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే చెన్నై నుండి ఒక స్మార్ట్ బాయ్‌ని సీఈఓగా నియమించామని ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోనీ ఫెర్నాండెజ్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ట్వీట్ చేశాడు. ఇతని రెజ్యుమో అద్బుతంగా ఉంది. ఇతను తప్పక అందరినీ ఆకట్టుకోగలడని అన్నారు. ఈ స్మార్ట్ బాయ్‌కు చెందిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇది ఇలా ఉంటే ఎయిర్ ఏషియా కంపెనీ కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇందుకు కంపెనీ చేసిన పెట్టుబడుల ప్రతిపాదనపై విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపీబీ) బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది. మే లేదా జూన్‌లో కంపెనీ కార్యకలాపాలు మొదలుకావచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ జాయింట్ వెంచర్‌లో టాటా గ్రూప్ కంపెనీల హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌కు 30 శాతం, మరో ఇన్వెస్టర్ అరుణ్ భాటియాకు చెందిన టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్ అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు 21 శాతం చొప్పున వాటాలు ఉండేలా ఒప్పందం కుదిరింది. 49 శాతం మెజారిటీ వాటా మాత్రం ఎయిర్ ఏషియా తీసుకోనుంది. ఎఫ్‌ఐబి ఆమోదం పొందితే జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ డీజీసీఎకు దరఖాస్తు చేయనుంది. విమానయాన సర్వీసులు నిర్వహించేందుకు డీజీసీఎ అనుమతి మంజూరు చేస్తుంది. కంపెనీ ఎదిగే కొద్ది మరింత మందిని ఉద్యోగంలో తీసుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి ఎయిర్‌ క్రాప్ట్‌కి సుమారు 20 మందిని తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో విమానయాన సంస్ద సేవలు ప్రారంభించగదలని ఇటీవల మలేసియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్ తెలిపిన విషయం తెలిసిందే. మలేషియా కంపెనీ తొలివిడతలో 3 నుండి 5 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురానుంది. ఎయిర్ ఏషియా ప్రాథమిక పెట్టుబడిగా సుమారు రూ. 275 కోట్లు వెచ్చించనుంది. ఈ ఎయిర్‌లైన్స్ తక్కువ చార్జీల విధానాన్నే కస్టమర్స్‌కు అందిస్తుంది. మొదటగా 3-4 ఎయిర్‌బస్ ఏ-320 విమానాలతో సర్వీసులను ప్రారంభించి ఆతర్వాత వీటి సంఖ్యను వేగంగా పెంచుతామన్నారు. చెన్నై ప్రధాన కేంద్రంగా ఈ ఎయిర్‌లైన్స్ నడవనుందని ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్(సీఈఓ) టోనీ ఫెర్నాండెజ్ తెలిపారు.

ఇటీవలే పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్‌ను టాటా గ్రూప్ సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ఈ విషయమై కలిశారు. కొత్త విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఎయిర్ ఏషియా పెట్టుకున్న జేవీ దరఖాస్తును ఎఫ్‌ఐపీబీ పరిశీలించనున్న ఒక రోజు ముందు కంపెనీకి ఇబ్బందులు తలెత్తనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అమల్లో ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకే వర్తిస్తాయని విమానయాన శాఖ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

వన్ఇండియా తెలుగు మనీ

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+