రూ. 50 లక్షలు దాటిన స్దిరాస్తి బదలాయింపుపై 1% టీడీఎస్

How Union Budget 2013 affects property investments?
న్యూఢిల్లీ: ఆర్దిక మంత్రిగా ఎనిమిదో సారి బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన పి చిదంబరం కేంద్ర బడ్జెట్లో మౌలిక సౌకర్యాల రంగానికి ప్రాముఖ్యతను కల్పించారు. ఈ రంగానికి నిధులు సమీకరించేందుకు రూ. 50 వేల కోట్ల పన్ను రహిత బాండ్లను జారీ చేయాలని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. 12వ పంచవర్ష ప్రణాళికలో మౌలిక సౌకర్యాల రంగానికి రూ. 55 లక్షల కోట్లు అవసరమవుతాయని, ఈ లక్ష్యాన్ని అందుకోవాలంటే కొత్త సాధనాల ద్వారా ఇన్‌ఫ్రా రంగానికి నిధులను సమీకరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

భారతదేశంలో ఉన్న 1.87 కోట్ల గృహకల్పనా లోటును కొంత మేరకు తీర్చేందుకు చిదంబరం కొన్ని ప్రతిపాదనులు తన బడ్జెట్‌లో చేశారు. అవెంటో చూద్దాం.

గ్రామీణ హౌసింగ్ ఫండ్ కేటాయింపులు ఈ ఏడాది రూ.4 వేల కోట్ల నుంచి రూ. 6 వేల కోట్లకు పెంచారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల డిమాండ్ నెరవేర్చడానికి ఉద్దేశించి ఒక ఫండ్‌ను ప్రతిపాదించారు. ఈ ఫండ్‌ను ఏర్పాటు చర్యలు తీసుకోవాలని నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ఫండ్‌కు రూ. 2,000 కోట్లు అందించాలని ఇందుకు తగిన ప్రతిపాదనలు చేశారు.

మొదటిసారి ఇంటి రుణం తీసుకొనే వారు చెల్లించే వడ్డీపై లభించే మినహాయింపులను లక్షకు పెంచారు. ప్రస్తుతం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 24ప్రకారం రుణం తీసుకున్న ఇంటిలో నివసిస్తుంటే చెల్లించే వడ్డీపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. తక్కువ వ్యయంతో కూడిన ఇళ్లకు ప్రస్తుతం ఇస్తున్న సేవల పన్ను మినహాయింపులను కొనసాగించారు.

ఇది ఇలా ఉంటే లగ్జరీ ఇళ్లు మాత్రం మరింత ప్రియం కానున్నాయి. రూ. కోటి దాటిన లేదా 2,000 చదరపు అడుగుల పైన కార్పెట్ ఏరియా ఇళ్లు, ఫ్లాట్స్‌పై సేవల పన్నుపై ప్రస్తుత 75% మినహాయింపును 70%కి తగ్గించారు. రూ. 50 లక్షలు దాటిన స్దిరాస్తి బదలాయింపుపై 1% టీడీఎస్ విధించారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+