
జప్తునకు ఆదేశించిన ఆస్తులలో గ్రూప్నకు చెందిన పుణేలోని ఆంబీ వ్యాలీ రిసార్ట్ టౌన్తోసహా ఢిల్లీ, ముంబైలలోగల ఇతర రియల్టీ ఆస్తులు కూడా ఉన్నాయి. ఈ నెల 6వ తారీఖున సుబ్రోతో రాయ్కు చెందిన సహారా గ్రూపుకి చెందిన రెండు కంపెనీల ఆస్తుల జప్తుకు మార్కెట్ రెగ్యులేటర్ సంస్ద అయిన సెబీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆర్డర్ను ధిక్కరించినందుకు సహారాకు చెందిన రెండు కంపెనీల ఖాతాలతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు కల్పించింది. దీంతో ఇన్వెస్టర్లకు రూ. 24,000 కోట్లను చెల్లించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన గ్రూప్ రెండు కంపెనీల అకౌంట్లను స్తంభింపజేసి, ఆస్తులను జప్తు చేసే సంపూర్ణ అధికారాలు సెబీకి లభించాయి.
ఆగస్టు 31వ తేదీన తాను ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సహారా ఇండియాకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (సైరెక్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (షిక్) ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయనందుకు సెబీని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కంపెనీలకు నోటీసులు జారీ చేశామని, బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేసి, ఆస్తులను జప్తు చేయడానికి బాంబే సివిల్ కోర్టును ఆశ్రయించామని సెబీ వివరణ ఇచ్చింది. అయితే సెబీ వివరణ పట్ల సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంతృప్తి చెందలేదు.
నోటీసులతో పనికాదని గత ఏడాది ఇచ్చిన ఆర్డర్ను ఖచ్చితంగా పాటించాలని కోర్డు ఆదేశించింది. ఇన్వెస్టర్ల నుంచి తీసుకున్న మొత్తం రూ.24,000 కోట్లను 15 శాతం వడ్డీతో మూడు నెలల్లో చెల్లించాలని ఆగస్టు 31వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల్లో డబ్బు వసూలు చేసి డిపాజిటర్లకు చెల్లించాలని ఆదేశించింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications