బీమా రంగం వృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం: చిదంబరం

P Chidambaram
న్యూఢిల్లీ: సామాన్య ప్రజలకు సైతం సులువుగా అర్దమయ్యే బీమా పథకాలను అందించాలని బీమా కంపెనీలకు కేంద్ర ఆర్దిక మంత్రి పి. చిదంబరం సూచించారు. బీమా రంగం వృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం బీమారంగానికి చెందిన కంపెనీ ఏజంట్లు ప్రజలను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ రంగంలో అనుకున్నంత వృద్ధి సాథ్యం కావడం లేదని పీఎన్‌బీ మెట్‌లైఫ్ బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

భారత్‌లో బీమా రంగం కుంటుపడటానికి ప్రధాన కారణం క్లిష్టమైన పాలసీలను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారు. ఏజెంట్లు పాలసీ పేరు చెప్పి ఏదో ఒక పాలసీ ప్రజలకు అంటగడుతున్నారు. దీని వల్ల బీమా రంగంపై ఏజెంట్లపై ప్రజలకు నమ్మకం తగ్గింది. అలా కాకుండా ప్రజలకు బీమా పాలసీ గురించి వారికి అర్ధమయ్యే విధంగా వివరిస్తే బీమారంగం పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో బీమారంగం పాలసీలు విక్రయించాలంటే పాలసీ ప్రాడక్టులు తేలికగా అర్ధం కావాలి... ఏజెంట్లు, అధికారులు ప్రజలను తప్పు దోవ పట్టించదరాదని దీనికి కంపెనీలు తమ ఏజంట్లను, అధికారులకు ఖచ్చిత మైన గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని చిదంబరం సూచించారు.

బీమా కవరేజి తీసుకునే ప్రజల సంఖ్య అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉందన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగ వాటా 4% కన్నా తక్కువగా ఉందన్నారు. బ్యాంకింగ్ సేవల విస్తరణ వేగంగా జరుగుతుండగా.. బీమా పథకాలకు డిమాండ్, విస్తరణ ఓ మోస్తరుగా మాత్రమే ఉంటోందని మంత్రి వివరించారు. బీమా వ్యాపారానికి సంబంధించి ఆసియాలో భారత్ సవాళ్లతో కూడుకున్న మార్కెట్ అన్నారు. అటు, మెట్‌లైఫ్ ఇండియాకి కార్పొరేట్ ఏజంటుగా వ్యవహరించడం ద్వారా తొలి ఏడాది రూ. 600 కోట్ల మేర ప్రీమియం వసూళ్లు నమోదు చేసినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) సీఎండీ కేఆర్ కామత్ తెలిపారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+