For Quick Alerts
For Daily Alerts
ప్రతి నెల డీజిల్ ధర లీటర్కు 40 నుండి 50 పైసలు పెరుగుతుంది: మెుయిలీ
|
ఆయిల్ సంస్థలు డీజిల్ ధరలను రెండో సారి ఎప్పుడు పెంచుతాయన్నది తాను చెప్పలేనని అన్నారు. ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాలకు ఉపయోగించే డీజిల్ను ఆయిల్ సంస్థల నుంచి కొనుగోలు చేసే కన్నా బయటి పెట్రోల్ బంకుల నుంచి కొనుగోలు చేయడం మేలని గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు అనుకుంటున్నట్లు తనకు తెలిసిందని మొయిలీ చెప్పారు. ఈ విషయమై తాము దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ రవాణా సంస్థ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో డీజిల్ను కొనుగోలు చేయాలనే దాని కన్నా.. డీజిల్పై రాష్ట్రంలో విధించే స్థానిక సేల్స్ టాక్స్ లేదా వ్యాట్ను తగ్గించుకోవాలని మొయిలీ సూచించారు.
తెలుగు వన్ఇండియా
Comments
English summary