చిన్న ఇన్వెస్టర్లకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంగా నిర్ణయం: సెబీ

Sebi creates separate debt segment on stock exchanges
చెన్నై: చిన్న ఇన్వెస్టర్లకు మరింత రక్షణ కల్పించే లక్ష్యంలో భాగంగా టేకోవర్ నిబంధనలను పటిష్టపరుస్తున్నట్లు మార్కెట్ రెగ్యులేటర్ సంస్ద సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) టేకోవర్ నియమ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు చెన్నైలో జరిగిన సెబీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఏదైనా కంపెనీలో 5% వాటా కలిగిన సంస్థలకు ఇకపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

తద్వారా కంపెనీల టేకోవర్లు జరిగే సందర్భాలలో అటు ప్రమోటర్లు, ఇటు ఇతర పెద్ద ఇన్వెస్టర్ల మధ్య చిన్న ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించనున్నట్లు వివరించింది. ఇదే విధంగా పబ్లిక్ వాటాదారులకు ప్రకటించే ఆఫర్ ధర, ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ధర వంటివి నిర్ణయించడంలో అమలవుతున్న నిబంధనలను కూడా సవరించింది. సమావేశంలో టేకోవర్, ప్రఫరెన్నియల్ కేటాయింపులు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సెబీ ఛైర్మన్ సిన్హా చెప్పారు.

సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీల్లో ప్రమోటర్ల వాటాను తగ్గించుకోవడానికి నిబంధనలను సరళతరం చేసింది. వేలంలో వాటాను కొనుగోలు చేయాలనే కంపెనీలు 25 మార్జిన్ నగదును ఉంచాలనే నిబంధనను రద్దు చేసింది. వేలం సమయంలో సూచిత ధరలను ప్రదర్శించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు ఎంత పెద్ద కంపెనీ అయినా.. వ్యక్తులైనా తప్పు చేస్తే తగిన చర్యలు తీసుకోవడంలో సెబీ వెనుకాడడం లేదని సిన్హా తెలిపారు .

ఇక స్టాక్ ఎక్స్ఛేంజీలలో రుణ మార్కెట్‌కు ప్రత్యేక విభాగాన్ని కేటాయించనున్నట్లు సెబీ చైర్మన్ సిన్హా చెప్పారు. దీంతో ఈ విభాగానికి సంబంధించి బ్యాంకులు ఎక్స్ఛేంజీలలో సభ్యులుగా నమోదుకావచ్చునని చెప్పారు. తద్వారా బ్యాంకులు కూడా ట్రేడింగ్‌ను నిర్వహించుకోవచ్చునని తెలిపారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+