ఇండియాకి మళ్లీ రేటింగ్ భయం.. తేలికగా తీసుకున్న ఆర్దికశాఖ

Fitch renews warning on India's credit rating downgrade
న్యూఢిల్లీ: భారత్ సార్వభౌమ పరపతి(సావరీన్ క్రెడిట్) రేటింగ్‌ను తగ్గిస్తామని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. వచ్చే ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధిలో రేటింగ్ డౌన్‌గ్రేడ్ ఉండొచ్చని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. మందగిస్తున్న ఆర్థిక వృద్ధి, ద్రవ్యలోటు కట్టడి విషయంలో అనిశ్చితి, కొనసాగుతున్న ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను ఇందుకు కారణంగా చూపింది. ఐతే ఆర్థిక మంత్రిత్వశాఖ మాత్రం దీన్ని చాలా తేలికగా తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందకు ప్రభుత్వం సరైన దిశలోనే పయనిస్తోందని స్పష్టం చేసింది. గత ఏడాది జూన్‌లో భారత్‌ సొవరిన్‌ రేటింగ్‌ను నెగెటివ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌ రేటింగ్‌ బీబీబీ-గా ఉంది.

ఇప్పటికే ఆర్థిక లోటును జిడిపిలో 5.3 శాతం వద్దే కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే పెరుగుతున్న వ్యయం, మందగించిన ఆదాయం కారణంగా ఆర్థిక లోటు లక్ష్యాన్ని 5.1 శాతం నుంచి 5.3 శాతానికి పెంచామన్నారు. ప్రస్తుతం భారత్ రేటింగ్ బిబిబి మైనస్ ప్రతికూల స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే రాబోయే 12-24 నెలల కాలంలో మరింతగా రేటింగ్ స్థాయి 50 శాతానికిపైగా క్షీణించే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఇదే జరిగితే అప్పుడు భారత్ పెట్టుబడులకు ఏమాత్రం ఆశాజనకం కాదని తెలిపింది.

ఇక మరో రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) సైతం 2014 సాధారణ ఎన్నికల దృష్ట్యా ఒకవేళ ఆర్థిక సంస్కరణలు మూలనపడితే రేటింగ్‌కు ముప్పు తప్పదని గత నెలలోనే హెచ్చరించింది. ప్రస్తుతం ఫిచ్, ఎస్‌అండ్‌పీలు భారత్‌కు ‘బీబీబీ మైనస్' నెగటివ్ రేటింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఇది చిట్టచివరి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ రేటింగ్. దీనికి గనుక కోత పెడితే ‘జంక్' స్థాయికి(పెట్టుబడులకు నిరుపయోగ గ్రేడ్) భారత్ సావరీన్ రేటింగ్ పడిపోతుంది. ఇదే జరిగితే, వర్ధమాన బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల గ్రూప్‌లో తొలిసారి జంక్ స్థాయికి దిగజారిన దేశంగా భారత్ అపప్రదను మూటగట్టుకుంటుంది. దీనివల్ల భారత కార్పొరేట్లకు విదేశీ రుణాల సమీకరణ కష్టసాధ్యంగా మారుతుంది. కాగా, మరో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ మాత్రం భారత్‌కు ‘బీఏఏ3' స్థిర అవుట్‌లుక్ రేటింగ్‌ను కొనసాగిస్తుండటం గమనార్హం.

టోకుధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఇప్పటికి అధికంగానే ఉందని నవంబర్‌ నెల ద్రవ్యోల్బణం 7.24 శాతంగా నమోదైందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. గత త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు బలహీనంగా 5 నుంచి 5.5 శాతంగా నమోదైందని ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో టోకు ధరల ఆధారిత సూచి సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం జీడీపీ 5.4 శాతంగా నమోదైందని.. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి జీడీపీ రేటు 5.7 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తోంది.

దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలానికి ద్రవ్యలోటు 80 శాతానికి చేరిందని ఇది ఆందోళన కలిగించే అంశయని ఫిచ్‌ వివరించింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న కొన్ని సంస్కరణలను ఫిచ్‌ ప్రశంసించింది. ఈ అడుగులు సరైన దిశలో పయనిస్తున్నాయని పేర్కొంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌లో ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వాటిని తప్పకుండా ప్రశంసించాలనితన నివేదికలో పేర్కొంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+