14వ ఫైనాన్స్ కమిషన్‌గా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి

Y V Reddy
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డా. వై వేణుగోపాల్ రెడ్డిని 14వ ఫైనాన్స్ కమీషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ఆర్దికశాఖ మంత్రి పి చిదంబరం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రప్రభుత్వానికి వచ్చే రెవెన్యూను కేంద్రం రాష్ట్రాలకు ఎలా పంచాలి.. అలాగే ప్రజలు వినియోగించుకునే విద్యుత్‌, నీరు, ప్రజలు ప్రయాణించే ప్రజారవాణాకు ఎంత మొత్తంలో ధరలు నిర్ణయించాలనే విషయాలన్నీ ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌లో వైవి రెడ్డితో పాటు వారిలో ప్రణాళిక సంఘం సభ్యులు అభిజిత్‌సేన్‌, మాజీ ఫైనాన్స్‌ సెక్రెటరీ సుష్మానాథ్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీకి చెందిన ఎం గోవిందరావు, మాజీ జాతీయ స్టాటిస్టికల్‌ కమిషన్‌ యాక్టింగ్‌ చైర్మన్‌ సుదీప్తో ముండ్లేలు సభ్యులుగా వ్యవహరిస్తారు.

2014 అక్టోబర్ 31 నాటికి ఈ సంఘం నివేదిక సమర్పిస్తుందని చిదంబరం వెల్లడించారు. కాగా, 2015 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఐదేళ్ల కాలానికి వర్తించేలా 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయనుంది.
అజయ్‌ నారాయణ ఝా కమిషన్‌ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. 71 సంవత్సరాల వైవి రెడ్డికి పబ్లిక్‌ ఫైనాన్స్‌లో మంచి అవగాహన ఉంది. కేంద్రం ప్రభుత్వంలో మాజీ బ్యాంకింగ్‌ సెక్రెటరీగా పనిచేశారు. రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా 2003 నుంచి ఐదు సంవత్సరాల పాటు తన సేవలందించారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+