మూడు రోజుల్లో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ విపణిలో గత 4 రోజులుగా 10 గ్రాముల బంగారం రూ. 30,900 వద్ద ఉండగా, శుక్రవారం ఒక్కసారిగా రూ. 32,000 వేలకు చేరుకుంది. ఇక న్యూఢిల్లీ విషయానికి వస్తే ధర తిరిగి రూ. 32,000 స్దాయిని చేరింది. ఆభరణాలకు సంబంధించి 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇంతే పరిమాణంలో పెరిగి రూ. 31,840కి ఎగిసింది. సెప్టెంబర్ 26 తర్వాత బంగారం ధర ఈ స్దాయికి చేరడం ఇదే మొదటిసారి. దీంతో అంతర్జాతీయంగా చూస్తే దేశీయ ధరలు అధికంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రోజువారీ 300 కిలోల బంగారం విక్రయం అయ్యేదని, ధనత్రయోదశి ఒక్కరోజే వ్యవధి ఉన్నా, ఇప్పుడు 60 కిలోలు కూడా దాటడం లేదని విక్రయదారులు తెలిపారు.
ఇక ధనత్రయోదశి సందర్బంగా వచ్చే ఆదివారం (నవంబర్ 11) బంగారు నాణేలను విక్రయించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 40 శాఖలు ఆదివారం కేవలం బంగారు నాణేలు విక్రయించడం కోసం పనిచేస్తాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆదివారం తెరిచే ఉంచే తపాలా కార్యాలయాలు: హైదరాబాద్ జీపీవో, బంజారా హిల్స్ (సిటీ డివిజన్), కాచిగూడ (హైదరాబాద్ దక్షిణ), సికింద్రాబాద్, విజయవాడ, బీకేపేట్ (విజయవాడ), గుంటారు, విశాఖపట్టణం, ఎల్బీకాలనీ (విశాఖపట్టణం), కర్నూలు, కడప ప్రధాన తపాలా కార్యలయాలు.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications