
గత ప్రభుత్వం హయాంలో కొందరు సీనియర్ అధికారులు, కంపెనీలోని కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ అవకతవకలకు పాల్పడ్డారని ఎంఏసీఎల్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై మాల్దీవుల అవినీతి నిరోధక శాఖ కమీషన్ కూడా విచారణ జరుపుతుంది. ఇటీవలే మాల్దీవుల ప్రభుత్వం సమావేశమై మాలే విమానాశ్రయం కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు మాల్దీవ్ అధ్యక్షుడు ప్రెస్ కార్యదర్శి మసూద్ ఇమావ్ ఒక ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ అధ్యక్షుడు మహ్మద్ నహీద్ అధికారంలో ఉన్నప్పుడు జీఎంఆర్ ఈ కాంట్రాక్టును దక్కించుకుంది. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
జీఎంఆర్ కాంట్రాక్టు రద్దు వల్ల భారత్తో ద్వైపాక్షిక సంబంధాలకు వచ్చిన ముప్పుఏమీ లేదని మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్ గత ప్రభుత్వ హయాంలో కుదర్చుకున్న ఒప్పందం కావడం కాగా.. ఈ డీల్ మా ప్రభుత్వానికి సందేహాస్పదంగా ఉండటం వల్ల దీనిని రద్దు చేయడం జరిగిందని, మిగతా కంపెనీల కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. మాలె అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి జీఎంఆర్ కాంట్రాక్టును ఇటీవల మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.
మాల్దీవుల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన విమానాశ్రయం కాంట్రాక్టు రద్దు అవ్వడానికి కారణం '25 డాలర్ల ఎయిర్పోర్ట్ డెవెలప్మెంట్ చార్జ్' కారణం అని అంటున్నారు. మాల్దీవ్ ప్రభుత్వం జీఎంఆర్లో జూన్ 2010లో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2012 నుంచి మాలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుండి సర్వీసు చార్జీ 25 డాలర్లతో పాటు రెండు డాలర్లు బీమా సర్చార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు ఈ ఒప్పందం అమలు కాలేదని జీఎంఆర్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వంతో జీఎంఆర్ కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిందని మాలే ప్రభుత్వం ఆరోపిస్తోంది.
తాము ఇప్పటి వరకు ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకపోయినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం లేవీ విధించరాదని తమకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రభుత్వం తాము ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ కాంట్రాక్టు రద్దు చేయడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి 2010లో మాల్దీవ్ ఆర్థికశాఖమంత్రి అబ్దుల్లా జిహాద్ కుదర్చుకున్న ఒప్పందంలో డెవెలప్మెంట్ చార్జీలు వసూలు చేసుకో వచ్చునని ఒప్పందం జరిగింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications