జీఎంఆర్ కాంట్రాక్టు రద్దు ప్రభావం భారత్ సంబంధాలపై ఉండదు: మాల్దీవుల అధ్యక్షుడు

Maldives hopes GMR contract termination will not impact ties
మాలె: జీఎంఆర్ కాంట్రాక్టు రద్దు వల్ల భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలకు వచ్చిన ముప్పుఏమీ లేదని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ డీల్ గత ప్రభుత్వ హయాంలో కుదర్చుకున్న ఒప్పందం కావడం కాగా.. ఈ డీల్ మా ప్రభుత్వానికి సందేహాస్పదంగా ఉండటం వల్ల దీనిని రద్దు చేయడం జరిగిందని, మిగతా కంపెనీల కాంట్రాక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. మాలె అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి జీఎంఆర్ కాంట్రాక్టును ఇటీవల మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ మాట్లాడుతూ జీఎంఆర్‌పై వహీద్ జాతీయవాదం, జెనోఫోబియా మతపరమైన దాడికి దిగడం వల్లనే కాంట్రాక్టు రద్దు అయిందని అన్నారు.

మాల్దీవుల్లో జీఎంఆర్ గ్రూప్ చేపట్టిన విమానాశ్రయం కాంట్రాక్టు రద్దు అవ్వడానికి కారణం '25 డాలర్ల ఎయిర్‌పోర్ట్‌ డెవెలప్‌మెంట్‌ చార్జ్' కారణం అని అంటున్నారు. మాల్దీవ్‌ ప్రభుత్వం జీఎంఆర్‌లో జూన్‌ 2010లో ఒక ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనవరి 2012 నుంచి మాలే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి ప్రయాణికుడి నుండి సర్వీసు చార్జీ 25 డాలర్లతో పాటు రెండు డాలర్లు బీమా సర్‌చార్జీ వసూలు చేయాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు ఈ ఒప్పందం అమలు కాలేదని జీఎంఆర్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రభుత్వంతో జీఎంఆర్‌ కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిందని మాలే ప్రభుత్వం ఆరోపిస్తోంది.

తాము ఇప్పటి వరకు ఎలాంటి సర్వీసు చార్జీలు వసూలు చేయకపోయినప్పటికీ.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం లేవీ విధించరాదని తమకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అంతేకాకుండా మాల్దీవుల ప్రభుత్వం తాము ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ కాంట్రాక్టు రద్దు చేయడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాస్తవానికి 2010లో మాల్దీవ్‌ ఆర్థికశాఖమంత్రి అబ్దుల్లా జిహాద్‌ కుదర్చుకున్న ఒప్పందంలో డెవెలప్‌మెంట్‌ చార్జీలు వసూలు చేసుకో వచ్చునని ఒప్పందం జరిగింది.

మాల్దీవుల ప్రభుత్వం కూడా జీఎంఆర్‌ ఇప్పటి వరకు డెవెలప్‌మెంట్ చార్జీలు వసూలు చేయలేదని అయినప్పటికీ.. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జీఎంఆర్‌కు మాల్దీవ్‌ ప్రభుత్వం నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో జీఎంఆర్‌ మాలే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జీఎంఐఎల్‌)ను వారంలోగా పూర్తి చేసి మాల్దీవ్‌ ఎయిర్ పోర్ట్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎంసీసీఎల్‌)కు అప్పగించాలని మాలే ప్రభుత్వం జీఎంఆర్‌ కన్సార్టియంను ఆదేశించిది. ఎంఏసీల్‌ కూడా తమకు వచ్చే రెవెన్యూ జీఎంఆర్‌ కన్సార్టియం కొంత భాగం ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+