ఇన్వెస్టర్లకు శుభవార్త: హిందుస్తాన్ కాపర్ ఆఫర్ ధర రూ. 155

Hindustan Copper shares slump as government sells stake
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని హిందూస్దాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్)లో 4 శాతం వాటాను ప్రభుత్వం ఈరోజు వేలం ద్వారా విక్రయించనుంది. దీంతో హిందూస్దాన్ కాపర్ లిమిటెడ్ షేరుకి కనీస ధర (ఫ్లోర్ ఫ్రైస్)ను రూ. 155గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ధరకు తక్కువ కాకుండా ఇన్వెస్టర్లు షేర్లను కోనుగోలుకి దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని నెలలుగా ఆలస్యం అవుతూ వచ్చిన డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం 9.59 శాతం వాటాను విక్రయానికి పెట్టడం ద్వారా సుమారు రూ. 1,376 కోట్లను సమీకరించే అవకాశం ఉంది.

దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో గురువారం హిందూస్దాన్ కాపర్ లిమిటెడ్ షేరు ధర 11 శాతం పైగా ఎగిసి రూ. 266 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల నుండి అంచనాలకు మించి డిమాండ్ ఏర్పడితే మరో 5.59 శాతం అదనంగా విక్రయించే అవకాశం ఉంది. షేర్ల కొనుగోలుకి ఇన్వెస్టర్లు బాంబే స్టాక్ ఎక్సేంజ్, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఈరోజు ఉదయం 9.15 గంటల నుండి సాయంత్రం 3.30 గంటల వరకూ బిడ్స్ దాఖలు చేసుకోవచ్చు. ఐతే ఈ ఆఫర్లో నాల్గవ వంతు వాటాను మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలకు రిజర్వ్ చేశారు.

ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 99.59 శాతం వాటా ఉంది. ప్రస్తుత వాటా విక్రయం అనంతరం ఇది 95.6 శాతానికి తగ్గుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుల్లో వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.30వేల కోట్ల పెట్టుబడులు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. మార్చితో ఈ ఆర్థిక ఏడాది ముగియనుండగా, ఇప్పటివరకు మార్కెట్ అననుకూల పరిస్థితుల కారణంగా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను కొనసాగించలేక పోయింది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+