మనీ లాండరింగ్ కేసు: వచ్చేనెల 10న హాజరు కావాలంటూ మహీంద్రా సత్యంకు నోటీసులు

Mahindra Satyam
హైదారాబాద్: మనీ లాండరింగ్ ఆరోపణల కేసుకు సంబంధించి డిసెంబర్ 10వ తారీఖున తమ ముందు హాజరు కావాలని మనీ లాండరింగ్ నిరోధక న్యాయస్దానం మహీంద్రా సత్యంకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద జప్తు చేసిన రూ. 822 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
డిసెంబర్ 10వ తారీఖున ఉదయం 11 గంటలకు కంపెనీ తరుపున అడ్వకేట్ లేదా అధికార ప్రతినిధి హాజరు కావాలని పేర్కొంది. ఈ నోటీసులపై స్పందించడానికి మహీంద్రా సత్యం ప్రతినిధి నిరాకరించారు. సత్యం కంప్యూటర్స్ స్కామ్ తర్వాత ఆ కంపెనీని టెక్ మహీంద్రా కొనుగోలు చేసి మహీంద్రా సత్యంగా మార్చిన విషయం తెలిసిందే.

సత్యం కంప్యూటర్స్ వ్వవస్తాపక ఛైర్మన్ రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులపై ఆర్దిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. ఇందులో భాగంగానే సత్యం కంప్యూటర్స్ హాయాంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై గత నెల 18న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మహీంద్రా సత్యంకి చెందిన ఎప్‌డీలను జప్తు చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. రామలింగరాజు ఆయన సహచరులు కంపెనీ ఆదాయాలను పెంచి చూపి అక్రమంగా షేర్లను విక్రయించడం లేదా తనఖా పెట్టడం ద్వారా సొమ్ము చేసుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు ఈడీ పేర్కొంది.

రామలింగ రాజు తన బినామీ సంస్థల ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 822 కోట్లను సత్యం కంప్యూటర్స్‌లోకి మళ్లించినట్లు ఈడీ తెలిపింది. దీంతో సంబంధిత అకౌంట్లను స్తంభింప చేసినట్లు ఈడీ తన ఆదేశాల్లో పేర్కొంది. నిబంధనల ప్రకారం ఆదేశాలు ఇచ్చిన 30 రోజుల్లోగా పీఎంఎల్‌ఏ కేసుల విచారణ న్యాయస్థానం వద్ద ఈడీ తమ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే రామలింగరాజు కంపెనీలోకి తెచ్చారంటున్న నిధులకు తమకు సంబంధమే లేదని మహీంద్రా సత్యం చైర్మన్ వినీత్ నయ్యర్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+