ఇన్ఫోసిస్ సహా వ్యవస్దాపకుడు నారాయణ మూర్తికి మానవతావాది అవార్డు

Narayana Murthy
న్యూఢిల్లీ: ఇన్సోసిస్ సహా వ్యవస్దాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తికి మానవతావాది అవార్డు లభించింది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల జీవితాలను మెరుగుపడేందుకు కృషి చేసిన వారికి ఈ అవార్డుని అందజేస్తారు. ఇప్పటికే ఈ అవార్డులు అందుకున్న వారిలో ఇంటర్నెట్‌ వ్యాపారవేత్త జెఫ్‌ స్కోల్‌, విద్యావేత్త క్వీన్‌ రెయినా అల్‌ అబ్దుల్లా (జోర్డాన్‌) నోబుల్‌ అవార్డు గ్రహీన అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్‌ గోర్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, అప్లయిడ్‌ మెటీరియల్స్‌ చైర్మన్‌ ఎమిరెట్స్‌ జేమ్స్‌ సీ మోర్గాన్‌లు ఈ అవార్డును దక్కించుకున్నారు.

ఈ అవార్డు అందుకున్న తర్వాత ఎన్ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పేదవారికి మెరుగైన కూడు, నీడ, ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే కాదు, వారిలో విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతందని నేను ప్రగాఢంగా విశ్విసిస్తాను అని మూర్తి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల పలు రంగాల్లో అభివృద్ధి సాధించడంతో ప్రజల్లో ఆత్మవిశ్వాసంతో పాటు గౌరవం లభిస్తుందని అన్నారు. 12 రంగాల్లో సేవలందించిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. వాటిలో ఆరోగ్యం, విద్య, పర్యావరణం, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నారాయణమూర్తికి అవార్డు అందజేశారు. నారాయణమూర్తి భారత ఐటీ రంగం అభివృద్ధికి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+