అనువై పరిస్దితులు కల్పించకుంటే... కొత్త బ్యాంకులకు లైసెన్స్‌లు ఇవ్వలేం

D Subbarao
పూణె: కొత్త బ్యాంకుల లైసెన్సుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్దిక మంత్రి చిదంబరం రిజర్వ్ బ్యాంకుకు సూచించిన మరుసటి రోజే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అందుకు అనువైన పరిస్దితులు కల్పించకుండానే కొత్త లైసెన్సులు జారీ చేయడం వీలుకాకపోవచ్చునని అన్నారు. నిన్న ఒక కార్యక్రమంలో పాల్గోన్న సందర్బంగా దువ్వూరి విలేకరులతో మాట్లాడుతూ కొత్త బ్యాంకుల లైసెన్సుల జారీని మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తూ వస్తున్నాం. కానీ అందుకు మరెన్నో పనులు పూర్తి కావల్సి ఉందని అన్నారు. ఆర్దిక వ్వవస్ద వృద్ది రేటు మందగమనాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నప్పటికీ.. ధరలు ఇంకా అధికంగానే ఉన్నాయని అన్నారు.

గురువారం కొత్త బ్యాంకింగ్ లైసెన్సుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఖరారు చేస్తుందని, దరఖాస్తుల స్వీకరణను ప్రారంభిస్తుందని ఆశిస్తున్నామని ఆర్దిక మంత్రి చిదంబరం చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిసారిగా 2002లో కొత్త ప్రైవేట్ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అంతకుముందు 1990 దశకం మధ్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకులను ఏర్పాటు చేసుకోనిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్‌లు ఏర్పాటు చేసే బ్యాంకులతో సహా కొత్త బ్యాంకుల ప్రవేశానికి గాను 2011 ఆగస్టులో తుది మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.

కాని ఈ విషయంలో ముందుకు సాగడానికి అవసరమైన చట్టబద్ధమైన అధికారాల కోసం ఆర్‌బిఐ నిరీక్షిస్తోంది. వాస్తవానికి బ్యాంకు లెైసెన్సులను 2008-09 సంవత్సరంలోనే జారీ చేయవలసి ఉంది. ‘బ్యాంకింగ్‌ క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా మేము ఆ లాంఛనాలను పూర్తి చేస్తున్నామని దువ్వూరి వ్యాఖ్యానించారు. వీలెైతే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో లేదా బడ్జెట్‌ సమావేశాలలో చట్టం సవరణ జరిగి తీరుతుందని నేను ఆర్‌బిఐకి హామీ ఇచ్చాను' అని చిదంబరం గురువారం ఢిల్లీలో చెప్పారు. అయినా, ఆర్‌బిఐ దరఖాస్తుల స్వీకరణను, వాటి ప్రాసెసింగ్‌ను ప్రారంభించినా, మొదటి బ్యాంకింగ్‌ లెైసెన్సు ఆ తదుపరి ఆరెనిమిది మాసాలలో జారీ కాకపోవచ్చని కూడా మంత్రి సూచించారు. ‘అందువల్ల లెైసెన్సు జారీ అయి, బ్యాంకులు ఆవిర్భవించే సమయానికి చట్టం సవరణ జరిగి ఉంటుంది' అని చిదంబరం చెప్పారు.

ప్రతిపాదిత సవరణలు బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టే ప్రైవేటు కంపనీలపై పర్యవేక్షణ అధికారాలను ఆర్‌బీఐకి సంక్రమిస్తాయి. ప్రత్యేకించి, ఏవైనా అవకతవకలు జరిగిన పక్షంలో ఏదైనా కొత్త బ్యాంకింగ్ కంపెనీ బోర్డును రద్దు చేసేందుకు తగిన చట్టపరమైన అధికారాలను తనకు అప్పగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరుతోంది. అలాగే 5 శాతానికి మించి షేర్లను కోనుగోలు చేయాలనుకొంటే అనుమతించే అధికారాన్ని తనకు కట్టబెట్టాలని కూడా ఆర్‌బీఐ ఆశిస్తోంది.

అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం రేటు 7.45 శాతానికి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత ద్రవ్యోల్బణం 7.45 శాతం స్దాయి చాలా ఎక్కువ. ఐతే వృద్ది రేటు పడిపోతుండటంపైన కూడా మేం చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. 2012-13 సంవత్సరానికి తదుపరి మధ్య త్రైమాసిక ద్రవ్య విధానం సమీక్ష డిసెంబర్‌ 18న జరగనున్నది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+