విజయ్ మాల్యాకు కష్టాలు, స్టాక్స్ గురించి నిలదీస్తున్న సెబీ

Vijay Mallya
ముంబై: యూబీ గ్రూప్ ఛైర్మన్ విజయ్ మాల్యా కష్టాలు ఇప్పటిలో తొలిగిపోయేటట్లు కనిపించడం లేదు. ఇటీవల యూబీ గ్రూప్‌కు చెందిన షేర్ల అమ్మకంపై మార్కెట్ నియంత్రణ సంస్ద సెబీ కొత్తగా మాల్యాని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. యునైటెడ్ బ్రూవరీస్ హోల్టింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్)కు చెందిన జూన్ నుండి సెప్టెంబర్ స్టాక్స్ ఎక్కువ ధర పలకడంతో 8.41 శాతం స్టాక్స్‌ని అమ్మడం జరిగింది. ఈ విషయాన్ని సెబీకి సమాచారం అందించలేదు.

సెబీ నిబంధనల ప్రకారం షేర్ హోల్డర్స్ ప్యాట్రన్‌లో ఏవైనా మార్పులు(షేర్లు అమ్మడం, కొనడం) జరిగినట్లైతే ప్రమోటర్లు రెండు రోజుల్లో సెబీకి తెలియజేయాల్సి ఉంది. ఐతే బాంబే స్టాక్ ఎక్సేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కానీ దీనిపై ఎటువంటి సమాచారం అందలేని తెలిపింది. ఈ విషయంపై యూబీ గ్రూప్ అధికార ప్రతనిధి మాట్లాడేందుకు నిరాకరించారు. ఇది ఇలా ఉంటే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లెైన్స్‌ ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు ఏప్రిల్‌ నెల వేతనం చెల్లించింది. మే నెల వేతనం దీపావళికి ముందే చెల్లిస్తుంది.

గత ఏడు నెలల నుంచి వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు సమ్మెకు దిగడం యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించడం... డీజీ సీఏ కింగ్‌ఫిషర్‌ లెైసెన్సును రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో యాజమాన్యం జోక్యం చేసుకోని ఉద్యోగులతో చర్చలు జరిపి అక్టోబర్‌ 25వ తేదీన సమ్మె విరమించేలా చేసింది. ఉద్యోగుల బకాయిలు దీపావళిలోగా కొంత మొత్తం... మిగిలింది డిసెంబర్‌లోగా చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఉద్యో గులు సమ్మె విరమించిన వెంటనే తక్షణమే మార్చి నెల వేతనం చెల్లించింది.

ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకు సమర్పించే భాగంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పరిస్దితిని ఆయనకు వివరించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లాకౌట్ అయిన తర్వాత తొలిసారి యూబి గ్రూప్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవతో 30 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఇంధనం ధరలు అధికంగా ఉండడం, అధిక పన్నులు, విదేశీ పెట్టుబడులకు అనుమతి లేకపోవడం ఇలా ఎన్నో విభిన్న కారణాల వల్ల భారత ఏవియేషన్ రంగం ఆకర్షణీయంగా లేదని అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు తగిన బాగస్వామి కోసం చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, ఆ కంపెనీ మరలా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు నిధులందించే సత్తా తన యూబి గ్రూప్‌నకు ఉందని తెలిపారు.

ఇక కింగ్‌ఫిషర్ యాజమాన్యం డీజీసీఏను సంతప్తి పరిచి సస్పెన్షన్‌ను ఎత్తి వేయించుకోవాల్సి ఉంది. ఐతే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం ఎన్ని విమానా సర్వీసులు నిర్వహిస్తుంది. ఎప్పటి నుంచి సర్వీసులు ప్రారంభం అవుతా అనే విషయంపై స్ఫష్టత రాలేదు. పౌర విమానయానశాఖ డెైరెక్టర్‌ జనరల్‌ మాత్రం తమ ముందు ఖచ్చితమై ప్రణాళికతో ముందుకు వస్తేనే లెైసెన్సును పునరుద్దరిస్తామని చెబుతుంది.

తెలుగు వన్ఇండియా

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+