
సెబీ నిబంధనల ప్రకారం షేర్ హోల్డర్స్ ప్యాట్రన్లో ఏవైనా మార్పులు(షేర్లు అమ్మడం, కొనడం) జరిగినట్లైతే ప్రమోటర్లు రెండు రోజుల్లో సెబీకి తెలియజేయాల్సి ఉంది. ఐతే బాంబే స్టాక్ ఎక్సేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ కానీ దీనిపై ఎటువంటి సమాచారం అందలేని తెలిపింది. ఈ విషయంపై యూబీ గ్రూప్ అధికార ప్రతనిధి మాట్లాడేందుకు నిరాకరించారు. ఇది ఇలా ఉంటే కింగ్ఫిషర్ ఎయిర్లెైన్స్ ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనం చెల్లించింది. మే నెల వేతనం దీపావళికి ముందే చెల్లిస్తుంది.
గత ఏడు నెలల నుంచి వేతనాలు చెల్లించలేదని ఉద్యోగులు సమ్మెకు దిగడం యాజమాన్యం లాకౌట్ ప్రకటించడం... డీజీ సీఏ కింగ్ఫిషర్ లెైసెన్సును రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో యాజమాన్యం జోక్యం చేసుకోని ఉద్యోగులతో చర్చలు జరిపి అక్టోబర్ 25వ తేదీన సమ్మె విరమించేలా చేసింది. ఉద్యోగుల బకాయిలు దీపావళిలోగా కొంత మొత్తం... మిగిలింది డిసెంబర్లోగా చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఉద్యో గులు సమ్మె విరమించిన వెంటనే తక్షణమే మార్చి నెల వేతనం చెల్లించింది.
ఆర్దిక ఇబ్బందులతో సతమతమవుతున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పునరుద్దరణ ప్రణాళికను ఏవియేషన్ రెగ్యులేటర్ DGCAకు సమర్పించే భాగంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పరిస్దితిని ఆయనకు వివరించారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లాకౌట్ అయిన తర్వాత తొలిసారి యూబి గ్రూప్ ఛైర్మన్ విజయ్ మాల్యా సివిల్ ఏవియేషన్ సెక్రటరీ కె.ఎన్ శ్రీవాత్సవతో 30 నిమిషాల పాటు చర్చించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఇంధనం ధరలు అధికంగా ఉండడం, అధిక పన్నులు, విదేశీ పెట్టుబడులకు అనుమతి లేకపోవడం ఇలా ఎన్నో విభిన్న కారణాల వల్ల భారత ఏవియేషన్ రంగం ఆకర్షణీయంగా లేదని అన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్కు తగిన బాగస్వామి కోసం చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, ఆ కంపెనీ మరలా నిలదొక్కుకోవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్కు నిధులందించే సత్తా తన యూబి గ్రూప్నకు ఉందని తెలిపారు.
ఇక కింగ్ఫిషర్ యాజమాన్యం డీజీసీఏను సంతప్తి పరిచి సస్పెన్షన్ను ఎత్తి వేయించుకోవాల్సి ఉంది. ఐతే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రస్తుతం ఎన్ని విమానా సర్వీసులు నిర్వహిస్తుంది. ఎప్పటి నుంచి సర్వీసులు ప్రారంభం అవుతా అనే విషయంపై స్ఫష్టత రాలేదు. పౌర విమానయానశాఖ డెైరెక్టర్ జనరల్ మాత్రం తమ ముందు ఖచ్చితమై ప్రణాళికతో ముందుకు వస్తేనే లెైసెన్సును పునరుద్దరిస్తామని చెబుతుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications