ముంబై: 23 రోజులుగా సమ్మె చేస్తున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు దీపావళి నాటికి మూడు నెలల జీతాన్ని చెల్లించడానికి కింగ్ఫిషర్ యాజమాన్యం ముందుకు వచ్చింది. ఉద్యోగులు, యాజమాన్యం మధ్య నిన్న (సోమవారం) నాలుగు గంటల పాటు జరిగిన చర్చలు ఫలించాయి. చర్చల అనంతరం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సీఈఓ సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హితేశ్ పటేల్ మాట్లాడుతూ చర్చలు ఫలించాయని, దీపవాళి నాటికి మూడు నెలల జీతాలు చెల్లించడానికి ముందుకు వచ్చామని ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి ఉద్యోగులకు సమయం ఇచ్చామని అన్నారు. ఈ ప్రతిపాదనను ఉద్యోగుల్లో ఒక వర్గం తిరస్కరించగా మరో వర్గం గురువారం నాడు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపింది.

ఏడు నెలలు వేతన బకాయిలను తక్షణం చెల్లించాలని గత 23 రోజులుగా కంపెనీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. కంపెనీ లాకౌట్ ప్రకటిచండం, విమానయాన సంస్ద డీజీసీఏ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లైసెన్స్ను రద్దు చేయడం వంటి తదితర పరిణామాలతో కంపెనీ సీఈఓ సంజయ్ అగర్వాల్ నిన్న చర్చలు జరిపారు. లాకౌట్ను కూడా పొడిగిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు సమగ్రమైన పునరుద్దణ ప్రణాళికను సమర్పించనున్నట్లు తెలిపారు. 24 గంటల్లో నెల రోజుల వేతనాన్ని, వారం రోజుల్లో రెండో నెల వేతనాన్ని, నవంబర్ 13 లోపు మూడో నెల జీతాన్ని చెల్లించడానికి యాజమాన్యం ప్రతిపాదన చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సుభాష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ కంపెనీ సీఈఓ సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హితేశ్ పటేల్ మీద మాకు నమ్మకం లేదు. వారి ప్రతిపాదనను మేం తిరస్కరించాం. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యాతో మేము సమావేశం అవుతామని అన్నాడు. ఇది ఇలా ఉంటే సమ్మె విరమించి ఉద్యోగులంతా విధులకు హాజరైనా డీజీసీఏ నుండి అన్ని అనుమతులు పొంది కార్యకలాపాలు ప్రారంభించడానికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దాదాపు నెల రోజుల సమయం పడుతుందని సమాచారం.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications