సత్యం కంప్యూటర్స్ కుంభకోణంతో ప్రమేయం ఉన్న రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు ఆర్దిక అవకతవలకలకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తమ విచారణలో రామలింగరాజు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహాచరులు కంపెనీ షేర్లను పెంచి చూపి అక్రమంగా విక్రయించడం లేదా తనఖా పెట్టడం ద్వారా సొమ్ము చేసుకున్నట్లు తేలిందని, ఈ కారణంతో అకౌంట్లను స్తంభింప జేసినట్లు ఈడీ తన ఆదేశాల్లో వివరించింది. బినామీ కంపెనీల ద్వారా సమీకరించిన రూ. 2,171 కోట్ల మొత్తంలో రూ. 822 కోట్లు సత్యం కంప్యూటర్స్లోకి మల్లించారు. ఎన్బీఎఫ్ల నుంచి తీసుకున్న రూ.2,717.45 కోట్లలో రూ.822 కోట్లు ఎఫ్డీలలోకి పోగా... మిగిలిన డబ్బు ఉద్యోగుల వేతనాలకు, ఖర్చులకు వాడుతుకున్నారని ఈడీపేర్కొంది.
ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకున్న రుణాలను రాజు ఏర్పాటు చేసుకున్న 327 కంపెనీలతో పాటు తన బంధువులు, మిత్రుల కంపెనీలకు తరలించారని ఈడీ ప్రకటనలో పేర్కొంది. ఈ ఫ్రంట్ కంపెనీలు ఈ డబ్బుతో ఆంధ్రప్రదేశ్తోపాటు, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో స్థిరాస్తులు కొనుగోలు చేశారని వివరించింది. ఈడీ ఇప్పటికే రాజుకు సంబంధించిన 354 స్థిరాస్తులను వాటి విలువ రూ.250 కోట్ల వరకు ఉంటుంది వాటిని జప్తు చేసింది. 2009 జనవరిలో రూ.7,136 కోట్ల ఖాతాల్లో గోల్మాల్ చేసినట్లు రామలింగ రాజు ఒప్పుకున్నారు. దీంతో సత్యం కంప్యూ టర్స్ సంక్షోభంలో కూరుకుపో యింది. అప్పటికి దేశంలో సత్యం నాలుగోస్థానంలో ఉంది. తర్వాత ఏప్రిల్ 2009లో టెక్ మహీంద్రా కొనుగోలు చేసి దాన్ని మహీంద్రా సత్యంగా పేరు మార్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా సత్యం రామలింగరాజు, ఆయన భార్య, కుమారుడు, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద, రాజుకు చెందిన సన్నిహిత బంధువుల పేర్లమీద దేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ముంబాయి, బెంగుళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ, పూణే, నాగపూర్, ప్రాంతాలలో ఉన్న దాదాపు వెయ్యికోట్లరూపాయలకు పెైగా విలువచేసే స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి సీబీఐకి కోర్టు అనుమతి మంజూరు చేసింది. దేశంలో మొత్తం 123 ప్రాంతాలలో రాజు ఆయన సంబంధీకులకు ఈ ఆస్తులు ఉన్నట్లు సీబీఐ కొద్దిరోజుల క్రితమే కోర్టుకు తెలియజేసింది. కేసు విచారణ తుదిదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఆ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications


