
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంతో ప్రమేయం ఉన్న రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులు ఆర్దిక అవకతవలకలకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తమ విచారణలో రామలింగరాజు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సహాచరులు కంపెనీ షేర్లను పెంచి చూపి అక్రమంగా విక్రయించడం లేదా తనఖా పెట్టడం ద్వారా సొమ్ము చేసుకున్నట్లు తేలిందని, ఈ కారణంతో అకౌంట్లను స్తంభింప జేసినట్లు ఈడీ తన ఆదేశాల్లో వివరించింది. బినామీ కంపెనీల ద్వారా సమీకరించిన రూ. 2,171 కోట్ల మొత్తంలో రూ. 822 కోట్లు సత్యం కంప్యూటర్స్లోకి మల్లించారు. ఎన్బీఎఫ్ల నుంచి తీసుకున్న రూ.2,717.45 కోట్లలో రూ.822 కోట్లు ఎఫ్డీలలోకి పోగా... మిగిలిన డబ్బు ఉద్యోగుల వేతనాలకు, ఖర్చులకు వాడుతుకున్నారని ఈడీపేర్కొంది.
ఎన్బీఎఫ్సీ నుంచి తీసుకున్న రుణాలను రాజు ఏర్పాటు చేసుకున్న 327 కంపెనీలతో పాటు తన బంధువులు, మిత్రుల కంపెనీలకు తరలించారని ఈడీ ప్రకటనలో పేర్కొంది. ఈ ఫ్రంట్ కంపెనీలు ఈ డబ్బుతో ఆంధ్రప్రదేశ్తోపాటు, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడులలో స్థిరాస్తులు కొనుగోలు చేశారని వివరించింది. ఈడీ ఇప్పటికే రాజుకు సంబంధించిన 354 స్థిరాస్తులను వాటి విలువ రూ.250 కోట్ల వరకు ఉంటుంది వాటిని జప్తు చేసింది. 2009 జనవరిలో రూ.7,136 కోట్ల ఖాతాల్లో గోల్మాల్ చేసినట్లు రామలింగ రాజు ఒప్పుకున్నారు. దీంతో సత్యం కంప్యూ టర్స్ సంక్షోభంలో కూరుకుపో యింది. అప్పటికి దేశంలో సత్యం నాలుగోస్థానంలో ఉంది. తర్వాత ఏప్రిల్ 2009లో టెక్ మహీంద్రా కొనుగోలు చేసి దాన్ని మహీంద్రా సత్యంగా పేరు మార్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా సత్యం రామలింగరాజు, ఆయన భార్య, కుమారుడు, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లమీద, రాజుకు చెందిన సన్నిహిత బంధువుల పేర్లమీద దేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ముంబాయి, బెంగుళూరు, మహారాష్ట్ర, ఢిల్లీ, పూణే, నాగపూర్, ప్రాంతాలలో ఉన్న దాదాపు వెయ్యికోట్లరూపాయలకు పెైగా విలువచేసే స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి సీబీఐకి కోర్టు అనుమతి మంజూరు చేసింది. దేశంలో మొత్తం 123 ప్రాంతాలలో రాజు ఆయన సంబంధీకులకు ఈ ఆస్తులు ఉన్నట్లు సీబీఐ కొద్దిరోజుల క్రితమే కోర్టుకు తెలియజేసింది. కేసు విచారణ తుదిదశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఆ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications