
బ్యాంకు గ్యారెంటీని గడువులోగా సమర్పించకపోతే తీర్పు బీసీసీఐకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గ్యారెంటీ సమర్పిస్తే ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా వివాదాన్ని కోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది. కాగా, అక్టోబర్ 31లోగా ఐపీఎల్-5కు బకాయిపడ్డ మొత్తం సొమ్మును కూడా చెల్లించాల్సిందేనని డెక్కన్ ఛార్జర్స్కి హైకోర్టు సూచించింది.
డీసీహెచ్ఎల్కు సుమారు రూ.5,000 కోట్ల రుణాలు మంజూరు చేసిన 20కి పైగా బ్యాంకులు అందులో మెజార్టీ వాటాను మాఫీ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రుణాల కోసం డీసీ సమర్పించిన పూచీకత్తు ఆస్తుల (కొల్లేటరల్ సెక్యూరిటీ) విలువపై ఉన్న అనుమానాలే ఇందుకు కారణం. డెక్కన్ ఛార్జర్స్పై ప్రస్తుతం జరుగుతున్న విచారణ కూడా నత్తనడక సాగుతుండటంతో తామిచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని రైటాఫ్ చేసుకొనే దిశగా బ్యాంకులు రంగం సిద్ధం చేసుకొంటున్నాయని బ్యాంకింగ్ వర్గాల సమాచారం.
సుమారు రూ.3,000 కోట్ల రుణాలు ఈ జాబితాలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే జూలై-సెప్టెంబర్(క్యూ2)లో ఆయా బ్యాంకుల ఎన్పీఏల రేటు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, ఒక్క డెక్కన్ చార్జర్స్కు మాత్రం దాదాపు రూ.1,000 కోట్ల విలువ వచ్చే అవకాశం ఉందని బ్యాంకులు నమ్మకంగా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు డీసీహెచ్ఎల్ ప్రతిపాదిస్తున్న కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(సీడీఆర్) ప్యాకేజీపై మెజార్టీ బ్యాంకులు ఆసక్తి కనబరచడం లేదు.
ఇది ఇలా ఉంటే డెక్కన్ ఛార్జర్స్ చెల్లించనున్న రూ. 100 కోట్లు తిరిగి తీసుకోలేని విధంగా, ఎటువంటి షరతులు లేకండా సమర్పించాలని ఆదేశించింది. ఈ బ్యాంకు గ్యారెంటీ ఒక ఏడాదిపాటు చెల్లుబాటులో ఉంటుందని కేసును విచారిస్తున్న జస్టిస్ ఎస్.జె.కఠావాలా పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)-6కు సంబంధించి అన్ని రకాల వ్యయాలను డెక్కన్ క్రానికల్ భరించాలని కోర్టు తెలిపింది. బీసీసీఐకి ఫ్రాంచైజీ చెల్లింపులు సహా ఆటగాళ్ల వేతనాలు, సపోర్టింగ్ బృంద ఖర్చులు పెట్టుకోవాలని కూడా సూచించింది. మ్యాచ్ల నిర్వహణతో పాటు ఇతర వ్యయాలనూ డెక్కన్ ఛార్జర్స్ భరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్-5కు సంబంధించిన వివాదరహిత హోటల్ బిల్లులు, రవాణా ఖర్చులను అక్టోబర్ 31లోగా చెల్లించాలని తెలిపింది. ఇందులో డీసీహెచ్ఎల్ విఫలమైతే.. తనకు తగిన అవసరం మేరకు బ్యాంకు గ్యారెంటీని నగదుగా మార్చుకొనేందుకు బీసీసీఐకి అధికారం ఉంటుందని జస్టిస్ కఠావాలా పేర్కొన్నారు. కాగా, తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ.. 7 రోజుల వరకు ఫ్రాంచైజీ రద్దు దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని బీసీసీఐని కోరారు.
ఐతే, తమ తీర్పు ఐపీఎల్-6కు సంబంధించి కొత్త ఫ్రాంచైజీని ఎంపిక చేసుకొనేందుకు బీసీసీఐకి ఆటంకం కాదని న్యాయమూర్తి వివరించారు. కాగా, ఫ్రాంచైజీ రద్దు కేసును 3 నెలల్లోగా ఉభయ వర్గాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సి.కె.థక్కర్ను మధ్యవర్తి (ఆర్బిట్రేటర్)గా నియమించిన విషయం తెలిసిందే.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications