
పారిశ్రామిక సమాఖ్య అసోచాం విడుదల చేసిన నివేదికలో బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు అప్ట్రెండ్లో ముందుంటాయని అంచనా వేసింది. ఇక వడ్డీ రేట్లకు ప్రభావితమయ్యే రియల్టీ, ఆటోమొబైల్, వినియోగ వస్తు రంగాలు నెమ్మదిగా పుంజుకుంటాయని తెలిపింది. ఈ సెప్టెంబర్లో ఎఫ్ఐఐలు రూ. 19,000 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. సెన్సెక్స్ ప్రస్తుతం 18,824 స్థాయిలో ఉంది.
దేశంలోని మౌలికరంగానికి సుమారు బిలియన్ డాలర్లు రూ.55 లక్షల కోట్లు అవసరం... దీనిపై ప్రభుత్వం ఖచ్చితమైన విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తేనే ఖచ్చితమైన ఫలితాలు కనిపిస్తాయని అసోచామ్ తెలిపింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన కొన్ని సంస్కరణల వల్ల నగదు వినియోగం పెరిగింది. దీనికి తోడు అమెరికన్ సెంట్రల్తో పాటు యూరోప్ బ్యాంకులు ఉద్దీపన పథకాలు చేపట్టి నగదు వినియోగం పెంచేందుకు ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల దేశీయ మదుపరులతో పాటు విదేశీ మదుపరులు భారత్ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం కలిగించేలా చేసింది. కరెంట్ ఖాతా లోటు కూడా అదుపులోకి వస్తోందని అసోచామ్ అధ్యక్షుడు రాజ్కుమార్ ధూత్ చెప్పారు.
గత మూడు సంవత్సరాల నుంచి బంగారం, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లు ప్రదర్శన చాలా పేలవంగా ఉందన్నారు. మూడు సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలతోనే ట్రేడ్ అవుతోంది. దీని వల్ల రీటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఇన్సిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు
ఇబ్బందులు పడ్డారు. వారితో పాటు భారత పారిశ్రామిక వేత్తలకు ఇబ్బందులు తప్పలేదని ఆయన వివరించారు. భారత ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని చాంబర్ కోరుతుందని ఆయన అన్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications