రూ. 50 వేల వరకూ ఉన్న సెక్యూరిటీలకు రుసుము అవసరం లేదు
బేసిక్ సర్వీస్ డీమ్యాట్ ఎకౌంట్ సదుపాయాన్ని అక్టోబర్ 1 నుండి కల్పించాలని డిపాజిటరీ పార్టిసిపెంట్లను సెబీ కోరింది. ప్రస్తుతం డీమ్యాట్ ఎకౌంట్లలో రూ. 2లక్షల కంటే తక్కువ విలువైన షేర్లు, సెక్యూరిటీలు ఉన్న మదుపర్లు తమ సాధారణ డీమ్యాట్ ఖాతాను చౌక డీమ్యాట్ ఖాతాగా మార్చుకోవచ్చు. దీనితోపాటు సాధారణ డీమ్యాట్ ఖాతా నిబంధనల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇక మ్యూచవల్ ఫండ్లలో పెట్టుబడులు నేటి నుండి మరింత సులభతరం అవనున్నాయి. దీనికి కారణం మ్యూచువల్ ఫండ్స్లలో సెబీ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఈరోజు నుండి అమలులోకి రానున్నాయి.
ఆగస్టు 16న జరిగిన సమావేశంలో మ్యూచువల్ ఫండ్ నిబంధనల్లో మార్పులకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈరోజు నుండి అమలులోకి వచ్చే విధంగా గత బుధవారం నోటిపై జారీ చేసింది. కొత్త మార్పులు ప్రకారం పథకాలపై మదుపు, సలహా రుసుము కింద ఫండ్లు కొంత మొత్తాన్ని వసూలు చేయవచ్చు.
తెలుగు వన్ఇండియా